Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mining Mafia In Guntur District

Mining Mafia: గుంటూరులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

Published Date :May 24, 2022 , 5:48 pm
By NTV WebDesk
Mining Mafia: గుంటూరులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ మట్టితవ్వేస్తూ దోచుకుంటున్నారు మైనింగ్ మాఫియా. అదేమని అడిగితే పట్టించుకునే నాథుడు లేడు. అడిగితే అధికారులను కూడా భయపెట్టే స్థాయికి బెదిరింపులతో మట్టి మాఫియా మాట్లాడుతుండటంతో వారికి అధికారపార్టీలో కొంతమంది మద్దతు ఉందని ప్రచారం జరగటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రత్తిపాడు,పొన్నూరు, పెదకూరపాడు, వినుకొండ నియోకవర్గాల్లో రాత్రి అయితేచాలు ట్రాక్టర్లు లారీలు ప్రొక్లైనర్ల రీ సౌండ్ తో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నారు. రాత్రి అయ్యిందంటే వందలకొద్దీ ట్రాక్టర్లు లారీలు సాయం తో గ్రామాల్లో మట్టి తవ్వేస్తున్నారు …ఏదో ఒక ఒక సర్వే నెంబర్ తో కొద్దిపాటి మట్టి మెరక తీసుకుంటామని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తెచ్చుకోవడం ఇక అదే అదునుగా వందల ట్రాక్టర్లు లారీలు పెట్టి భారీ ప్రక్రియలతో మట్టి మాయం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క పంచాయతీ కో ఏ ఒక గ్రామానికి సంబంధించిన అంశం కాదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో దాదాపు సగం చోట్ల ఇదే పని. ట్రాక్టర్ లు , లారీలు గ్రామాల్లో విపరీతమైన సౌండ్ తో మట్టి దోచేయడం ఒక పనిగా మారింది. అదేమని అడిగితే గ్రామస్థులను బెదిరించి ఫలానా వర్గం కాబట్టి నువ్వు మా మీద ఫిర్యాదు చేస్తున్నావ్..అధికారులకు సమాచారం ఇచ్చి పంపుతుంది నువ్వే నా అంటూ ఘర్షణకు దిగుతున్నారు.

అధికారులను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు మాఫియా. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం, కాకుమాను మండలం, వినుకొండ, పొన్నూరు, చేబ్రోలు, అమరావతి, క్రోసురు మండలాల్లో రాత్రిపూట యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజక వర్గంలో గత రాత్రి అక్రమ మైనింగ్ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులను మైనింగ్ మాఫియా దాదాపు కొట్టినంత పని చేసిందని సమాచారం.

ప్రతిసారి మా పని కి ఎందుకు అడ్డం వస్తున్నారు అంటూ మూకుమ్మడి దాడి చేయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఏంటి మమ్మల్ని చంపుతారా? ఎందుకు నా మీద ఇలా దాడి చేస్తున్నారు అని ఆవేదన చెందుతూ మరి అక్కడి నుంచి ఓ ఎస్ ఐ వెళ్లిపోయారు. రాత్రిపూట మట్టి తవ్వకాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా ఆచరణలో మాత్రం అవి అమలు కావడంలేదని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి చెరువు పూడిక తీయటానికి లేదా చెరువు కరకట్టలు పటిష్ట పరచడానికి సమీపంలో ఉన్న పొలాల నుండి కొద్దిగా మట్టి తీసుకొని పనులు చేసుకోవచ్చు. కానీ గ్రామాల్లో ఉన్న ఏదో ఒక సర్వే నంబర్ నుండి అనుమతులు తీసుకుని పొలంలో పూడిక తీయాలంటూ రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకొని అక్కడినుంచి నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా మట్టి మాఫియా ప్రవర్తిస్తుంది.

కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో చూసుకొని ఆ ప్రభుత్వంలోని యథేచ్ఛగా మట్టి మాఫియా భూములను తవ్వేస్తుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మాత్రమే ఈ పొలాల్లో మట్టి తవ్వకాలు ఉండాలి. అది కూడా రెవెన్యూ మైనింగ్ ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో జరపాల్సిన మట్టి తవ్వకాలు రాత్రిపూట ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది చిన్న చిన్న లాలూచీ లకు సిద్ధపడి గ్రామాల్లో ఇష్టారాజ్యంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినా మైనింగ్ మాఫియా జాగ్రత్త పడుతుందన్న సమాచారం ఉంది.

Jagga Reddy: తెలంగాణ రైతులపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • apgovt
  • attacks on police
  • Guntur
  • leaders support

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions