Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజధాని అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పవన్.. రాష్ట్ర ప్రజల్లో ప్రాంతీయ, కుల భావాల కంటే రాష్ట్రం పట్ల అనుబంధం పెరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల్లో తమ రాష్ట్రం పట్ల ఉన్న భావన స్పష్టంగా కనిపిస్తోందని, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రం కంటే కులాలపై ఎక్కువ చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
అసలు మావిగన్ పేరు వినడానికి చిరాకుగా ఉందని ఫైర్ అయ్యారు పవన్.. రాజధాని అమరావతి మీద వైసీపీ ఆరోపణలు చేస్తోంది.. కానీ, వారు పెట్టిన ఆ పేరు వినాలంటేనే చిరాకుగా ఉంటుంది.. మూడు జిల్లాలను కలిసి రాజధాని కావాలంటున్నారు అని దుయ్యబట్టారు.. ప్రస్తుత రాజధాని కనీసం అమరావతికి పరిమితం.. గత ముఖ్యమంత్రి చెప్పేది మూడు జిల్లాలు కలిపి మూడు రాజధానులుగా ఇంకా పెద్దగా అవుతుంది అని ఎద్దేవా చేశారు.. మీకు అమరావతి నచ్చలేదు.. ముూడు రాజధానులు కావాలా.. అయితే, పాలసీ పై మాట్లాడండి.. చంపేస్తాం.. నరికేస్తాం అంటే.. ఇక్కడ ఎవరూ భయపడరని వాళ్లు తెలుసుకోవాలి అని సూచించారు.. గత సీఎం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అంటున్నారు.. మొత్తం రియల్ ఎస్టేట్ లు అమ్ముకోవచ్చు అని వారి కుట్రలు అని ఆరోపించారు..
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, వారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అమరావతి తమ రాజధాని అనే భావన కలగాలని, ‘జై ఆంధ్రా’ అనే నినాదం రాష్ట్ర ఐక్యతకు ప్రతీకగా నిలవాలని పేర్కొన్నారు. రాజధాని అంశంపై భిన్నాభిప్రాయాలు ఉంటే విధానపరంగా చర్చించుకోవచ్చని, కానీ బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పవన్ అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై మాట్లాడాలనుకుంటే పాలసీల పరంగా చర్చించాలని, వ్యక్తిగత విమర్శలు లేదా బెదిరింపులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మూడు ప్రాంతాలను కలిపి రాజధాని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్న పవన్, అలాంటి ఆలోచనలకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని విస్తృత స్థాయిలో అంగీకారం లభించిన నేపథ్యంలో, దానిని ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన పవన్, రౌడీయిజం, గూండాయిజం తరహా రాజకీయాలకు ఎవరూ భయపడరని అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదోపవాదాల ద్వారా సమస్యలకు పరిష్కారం వెతకాలని, బెదిరింపులతో రాజకీయాలు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. అమరావతి అంశంపై కొత్త వివాదాలు సృష్టించకుండా, రైతుల ఆశయాలను గౌరవిస్తూ రాజధాని అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
-
Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!