Venkaiah Naidu: ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు .. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు..
- నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది..
- మన కుటుంబ, వివాహ వ్యవస్థను చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి..
- ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు: వెంకయ్యనాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణామాలపై ప్రజలు ఆలోచన చేయాలి.. రాజకీయ నాయకుల నడవడిక, పని తీరును ప్రజలు గమనిస్తుండాలి.. ఎప్పుడూ ఆదర్శంగా, క్రమశిక్షణతో నమ్మిన సిద్దాంతం కోసం పని చేయాలని సూచించారు. జట్కా బండి పైన తిరిగి అద్వానీ, వాజ్ పాయ్ ప్రచారం చేసేవారు.. లా చదువుకుని, జన సంఘ్ పట్ల ఆకర్షితుడై, ఆ తరువాత బీజేపీ కోసం శ్రీమన్నారాయణ పని చేశారని గుర్తు చేశారు. ఎన్నికలలో పోటీ చేయకుండా, పదవులు ఆశించకుండా ఆయన పార్టీ కోసం పని చేశారు.. మన ప్రవర్తన చూసి మన పార్టీ పై నమ్మకం కలిగించాలి.. మన మాట, మన పని, మనం చేసే సాయమే నాయకుడిగా ఎదిగేలా చేస్తుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.
Read Also: Kartavya Bhavan 3 Inaugurate: కర్తవ్య భవన్-3ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
అయితే, ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పాడిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బస్సుల రాకపోకల తరహాలో.. రాజకీయ నాయకుల రాకపోకలు అని వారి వివరాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సరైనా కారణం ఉంటేనే నాయకులు పార్టీ మారేవారు.. కానీ, ఇప్పుడు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు అని మండిపడ్డారు. ఒక పార్టీని నమ్మితే ఆ పార్టీ కోసం పని చేసేవారే నిజమైన నాయకుడు.. రాజకీయ నాయకులకు సమయ పాలన కూడా ఎంతో ముఖ్యం అన్నారు.
Read Also: Bollywood : షాహీద్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్.. మధ్యలో ప్రభాస్.. గెలుపెవరిది
ఇక, నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే.. కష్టం అనేది ఉండదు.. ఎదుటి వారితో గౌరవ మర్యాదలు పాటిస్తే.. అదే గౌరవం మనకీ దక్కుతుంది అని తెలిపారు. ఎవరితోనైనా స్నేహం మన కనురెప్ప లాగా ఉండాలని సూచించారు. ఎప్పుడు అవసరం వచ్చినా కనురెప్ప లాగా ఆ కష్టానికి అడ్డంగా నిలబడాలని మాజీ ఉపరాష్ట్రపతి తెలియజేశారు.
తాజావార్తలు
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!