Venkaiah Naidu: ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు .. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు..
- నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది..
- మన కుటుంబ, వివాహ వ్యవస్థను చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి..
- ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు: వెంకయ్యనాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: విజయవాడలో వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో ఉండే పరిణామాలపై ప్రజలు ఆలోచన చేయాలి.. రాజకీయ నాయకుల నడవడిక, పని తీరును ప్రజలు గమనిస్తుండాలి.. ఎప్పుడూ ఆదర్శంగా, క్రమశిక్షణతో నమ్మిన సిద్దాంతం కోసం పని చేయాలని సూచించారు. జట్కా బండి పైన తిరిగి అద్వానీ, వాజ్ పాయ్ ప్రచారం చేసేవారు.. లా చదువుకుని, జన సంఘ్ పట్ల ఆకర్షితుడై, ఆ తరువాత బీజేపీ కోసం శ్రీమన్నారాయణ పని చేశారని గుర్తు చేశారు. ఎన్నికలలో పోటీ చేయకుండా, పదవులు ఆశించకుండా ఆయన పార్టీ కోసం పని చేశారు.. మన ప్రవర్తన చూసి మన పార్టీ పై నమ్మకం కలిగించాలి.. మన మాట, మన పని, మనం చేసే సాయమే నాయకుడిగా ఎదిగేలా చేస్తుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.
Read Also: Kartavya Bhavan 3 Inaugurate: కర్తవ్య భవన్-3ను ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Also Read
- Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- AP Cabinet: ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
అయితే, ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పాడిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బస్సుల రాకపోకల తరహాలో.. రాజకీయ నాయకుల రాకపోకలు అని వారి వివరాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సరైనా కారణం ఉంటేనే నాయకులు పార్టీ మారేవారు.. కానీ, ఇప్పుడు డైపర్లు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు అని మండిపడ్డారు. ఒక పార్టీని నమ్మితే ఆ పార్టీ కోసం పని చేసేవారే నిజమైన నాయకుడు.. రాజకీయ నాయకులకు సమయ పాలన కూడా ఎంతో ముఖ్యం అన్నారు.
Read Also: Bollywood : షాహీద్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్.. మధ్యలో ప్రభాస్.. గెలుపెవరిది
ఇక, నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు. ఏ పని అయినా ఇష్టపడి చేస్తే.. కష్టం అనేది ఉండదు.. ఎదుటి వారితో గౌరవ మర్యాదలు పాటిస్తే.. అదే గౌరవం మనకీ దక్కుతుంది అని తెలిపారు. ఎవరితోనైనా స్నేహం మన కనురెప్ప లాగా ఉండాలని సూచించారు. ఎప్పుడు అవసరం వచ్చినా కనురెప్ప లాగా ఆ కష్టానికి అడ్డంగా నిలబడాలని మాజీ ఉపరాష్ట్రపతి తెలియజేశారు.
తాజావార్తలు
-
Raviteja : రవితేజ కెరీర్కు ‘ఇరుముడి’ గండం గట్టెక్కిస్తుందా?
-
Toxic : కేజీఎఫ్ ఫార్ములానే.. అటు ఇటు చేసిన యష్!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!