Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mantralayam Temple Hotels High Rates

Mantralayam Hotel Rates: మంత్రాలయంలో హోటళ్ళ నిలువు దోపిడీ

Published Date :October 24, 2022 , 8:15 pm
By NTV WebDesk
Mantralayam Hotel Rates: మంత్రాలయంలో హోటళ్ళ నిలువు దోపిడీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మహా పుణ్యక్షేత్రం మంత్రాలయం. కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. ప్రత్యేక వేడుకల సందర్భాల్లో లక్షల సంఖ్యలో తరలి వస్తారు. పుణ్యక్షేత్రం వసతి గదులు తక్కువ. అదే ప్రైవేట్ లాడ్జి నిర్వాహకులకు వరంగా మారింది. 12 గంటల వసతికి ఫైవ్‌ స్టార్ హోటళ్లకు మించి డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు వస్తారు. గురు, శని, ఆది వారాల్లో 50 వేల వరకు భక్తులు వస్తారు. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు , పూర్వ పీఠాధిపతుల సమారాధనకు లక్షల్లో వస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు తరలి వస్తారు. రాఘవేంద్ర స్వామి మఠంకు సంబంధించి సుమారు 600 వసతి గదులు ఉన్నాయి. ప్రైవేట్ లాడ్జీలు 100 ఉండగా వాటిలో 2000 గదులు ఉన్నాయి. 3 స్టార్ హోటల్ ఒకటి, అదే స్థాయిలో మరో హోటల్ వుంది. మఠంకు సంబంధించి వసతి అందరికి లభించే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు.

Read Also: Puri Jagannadh: బ్రేకింగ్.. పూరిని బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్స్.. ఆడియో లీక్

Also Read

  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
Add as a preferred
source on google

మంత్రాలయంలో వసతి కొరతను అవకాశంగా తీసుకొని సాధారణ గదులకు కూడా భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. రోజుకు 24 గంటలు అయితే 12 గంటలు ఒక రోజుగా పరిగణించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రైవేట్ లాడ్జీలు 24 గంటలకు వెయ్యి రూపాయల వరకు, స్టార్ హోటల్ లో 2 వేలు, 3 వేలు వసూలు చేస్తున్నారు. దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలు, ఆరాధానోత్సవాలు, సెలవు దినాల్లో మామూలు హోటళ్లు 12 గంటలకు 5 వేలు, 8 వేలు, 10 వేలు వసూలు చేస్తున్నారు. మంత్రలయంలోని స్టార్ హోటల్ స్థాయిలో ఉన్న హోటల్ లో సాధారణ రోజుల్లోనూ, పండుగలు, సెలవులు, ఉత్సవాల రోజుల్లో ఒకే ధర వసూలు చేస్తుండగా మామూలు హోటళ్లలో 12 గంటలకు 5 వేలు, 8 వేలు , 10 వేలు వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు ఒక గదికి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు.

మంత్రాలయంలో డబ్బులు చెల్లించగలిగిన వారు 10 వేలు, 20 వేలు చెల్లించి గదులు తీసుకోగలుగుతున్నారు. మిగిలిన వారు ఏ బస్టాండులోనో, మఠం ప్రాంగణంలో రోడ్డుపై విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ లాడ్జీలు భక్తులను దోచుకుంటున్నా నియంత్రించాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. కొందరు నెలసరి మామూళ్లు తీసుకొని మౌనం వహిస్తే మరికొన్ని శాఖలు తమకు ఉచితంగా గదులు ఇస్తే చాలని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు భక్తుల నుంచి దోచుకుంటున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ లాడ్జీల దందా కు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రాలయంలో ప్రైవేట్ లాడ్జీల దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవలని భక్తులు కోరుతున్నారు. ప్రతి లాడ్జీలో ధరల పట్టిక ప్రదర్శించేలా ఆదేశించాలని, నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.

Read Also: Minister Prashanth Reddy: రాజగోపాల్‌ రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5star Hotel Rates
  • Hotel Rooms Problem
  • Kurnool
  • Mantralayam
  • Mantralayam Darshanam

తాజావార్తలు

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

  • IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్ విడుదల.. ఫైనల్‌ మ్యాచ్ ఎక్కడో తెలుసా?

  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions