Liquor Destroy: వేల లీటర్ల మద్యం ధ్వంసం.. ఘొల్లుమన్న లిక్కర్ లవర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్ళీ లిక్కర్ బాబులు తెగ ఫీలయిపోయారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3,547.8 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు అధికారులు. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పర్యవేక్షణలో గంట్యాడ గ్రామం లేఅవుట్ లో అక్రమ మద్యం ధ్వంసం చేశారు సిబ్బంది. ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉంటే హిస్టరీ షీటు తెరుస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. అక్రమ మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదు చేసేందుకు వెనుకాడమన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణపై సమాచారాన్ని డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు అందించాలని కోరారు జిల్లా ఎస్పీ.
వివిధ పోలీసు స్టేషన్లలో 2019 నుంచి 2021 సంవత్సరం వరకు నమోదైన 928 ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేశామన్నారు. 3,547.8 లీటర్ల మద్యంను ధ్వంసం చేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక వెల్లడించారు. 928 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 17,815 మద్యం బాటిల్స్ లోగల 3,547.8 లీటర్ల మద్యంను ధ్వంసం చేసామన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరంతరం దాడులు నిర్వహించి, మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఒక్కటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేందుకుగాను, హిస్టరీ షీట్లును తెరుస్తున్నామన్నారు.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
Narsapur Congress: అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.. ఇప్పుడు సీన్ రివర్స్
అదే విధంగా నాటుసారా తయారీదారులకు నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులపై కూడా నిఘా పెట్టామన్నారు.నల్ల బెల్లంను నాటు సారా తయారీకి విక్రయించే వ్యాపారులను గుర్తించి, కేసుల్లో నిందితులుగా చేరుస్తున్నామన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎక్కువ కేసుల్లో నిందితులుగా పట్టుబడిని ఇద్దరిని గుర్తించి, వారిపై పి.డి.యాక్ట్ (ప్రివెన్షన్ డిటెక్షన్ చట్టం) నమోదు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసామన్నారు. జిల్లాలో బెల్టు షాపులు లేకుండా, నాటుసారాను పూర్తిగా నియంత్రించేందుకు ఇప్పటికే 928 కేసుల్లో 1200మందికి పైగా నిందితులను అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?