Liquor Destroy: వేల లీటర్ల మద్యం ధ్వంసం.. ఘొల్లుమన్న లిక్కర్ లవర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్ళీ లిక్కర్ బాబులు తెగ ఫీలయిపోయారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3,547.8 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు అధికారులు. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పర్యవేక్షణలో గంట్యాడ గ్రామం లేఅవుట్ లో అక్రమ మద్యం ధ్వంసం చేశారు సిబ్బంది. ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉంటే హిస్టరీ షీటు తెరుస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ. అక్రమ మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదు చేసేందుకు వెనుకాడమన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణపై సమాచారాన్ని డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు అందించాలని కోరారు జిల్లా ఎస్పీ.
వివిధ పోలీసు స్టేషన్లలో 2019 నుంచి 2021 సంవత్సరం వరకు నమోదైన 928 ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేశామన్నారు. 3,547.8 లీటర్ల మద్యంను ధ్వంసం చేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక వెల్లడించారు. 928 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 17,815 మద్యం బాటిల్స్ లోగల 3,547.8 లీటర్ల మద్యంను ధ్వంసం చేసామన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరంతరం దాడులు నిర్వహించి, మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఒక్కటి కంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేందుకుగాను, హిస్టరీ షీట్లును తెరుస్తున్నామన్నారు.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
Narsapur Congress: అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.. ఇప్పుడు సీన్ రివర్స్
అదే విధంగా నాటుసారా తయారీదారులకు నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులపై కూడా నిఘా పెట్టామన్నారు.నల్ల బెల్లంను నాటు సారా తయారీకి విక్రయించే వ్యాపారులను గుర్తించి, కేసుల్లో నిందితులుగా చేరుస్తున్నామన్నారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎక్కువ కేసుల్లో నిందితులుగా పట్టుబడిని ఇద్దరిని గుర్తించి, వారిపై పి.డి.యాక్ట్ (ప్రివెన్షన్ డిటెక్షన్ చట్టం) నమోదు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసామన్నారు. జిల్లాలో బెల్టు షాపులు లేకుండా, నాటుసారాను పూర్తిగా నియంత్రించేందుకు ఇప్పటికే 928 కేసుల్లో 1200మందికి పైగా నిందితులను అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..