MLA Bala Nagi Reddy: వాలంటీర్ వ్యవస్థపై ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. మేం మోసపోయాం..!
- వాలంటీర్ వ్యవస్థపై ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- ‘మేం మోసపోయాం.. మా కొంప ముంచింది వాలంటీర్ వ్యవస్థే’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Bala Nagi Reddy: మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వాలంటీర్ వ్యవస్థ కారణంగా తాము ప్రజలకు దూరమయ్యామని, ఈ వ్యవస్థను నమ్ముకొని తాము మోసపోయామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసిందని, “వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది” అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఆధారపడటంతో ప్రజలకు న్యాయం చేయలేకపోయామని కూడా ఆయన అంగీకరించారు.
Read Also: Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
“వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. ప్రజలు–నాయకుల మధ్య దూరం పెరిగింది” అని బాల నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్పై కూడా ఎమ్మెల్యే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు కూడా జగన్కు కార్యకర్తల దగ్గర ఫోటోలు దిగేందుకు సమయం దొరకడం లేదు” అని అన్నారు. ఈసారి అయినా కార్యకర్తలను నిరాశపరచకుండా సమయం కేటాయించి ఫోటోలు దిగాలని కోరారు. అలాగే, రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘2.0 వ్యవస్థ’ను అమలు చేసి, తమను ఇబ్బందులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాల నాగిరెడ్డి హెచ్చరించారు. జగన్ ఆ వ్యవస్థను అమలు చేయకపోతే, తన నియోజకవర్గంలో తానే 2.0 వ్యవస్థను అమలు చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో విమర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!