Sugali Preethi Case: పవన్ కల్యాణ్పై మరోసారి సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఓజీ డైలాగ్ చెప్పి మరి..!
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు..
- సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగింతపై ప్రకటన ఏది..? అని ప్రశ్న..
- సీఎం, డిప్యూ సీఎం, లోకేష్ పై మండిపడ్డ పార్వతి..
- ఓజీ సినిమా డైలాగ్ చెప్పి మరి...
Sugali Preethi Case: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సుగాలి ప్రీతి తల్లి.. సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు తల్లి పార్వతి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం పోరాటం చేస్తున్నా.. 8 ఏళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాను.. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను.. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదు అన్నారు.. కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు తన కేసును సీబిఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
- CM Chandrababu: బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డూ.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబు, పవన్ కల్యా్ణ్ గొప్పలు చెబుతున్నారు.. తమ సమస్యలను పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ప్రస్తవిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. పవన్ కల్యాణ్ ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడారా..? అని నిలదీశారు పార్వతి.. అసలు, పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. పవన్ తన పై, తన కులంపై, తన కుటుంబంపై వారి నాయకుల చేత అనేక ఆరోపణలు చేయించారు.. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తమపై అనేక ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం, జనసేన పార్టీ ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు అనేక ఆరోపణలు చేశారు. తమను కించపరిచే విధంగా తమ పై అనేక కామెంట్లు చేశారు అని మండిపడ్డారు..
ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. కానీ, అధికారంలో వచ్చిన తరువాత తమను పట్టించుకోవడం లేదన్నారు పార్వతి.. సుగాలి ప్రీతి కేసులో తమకు అన్యాయం జరుగుతుందని నమ్మించి పవన్ కల్యాణ్ నమ్మక ద్రోహం చేశారన్న ఆమె.. న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు గిరిజన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారు అని ఫైర్ అయ్యారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా తమకు కలిసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు పార్వతి.. హైకోర్టులో తాము పిటిషన్ వేశాం, తమకు న్యాయం కోసం వీల్ చైర్ యాత్రను నిర్వహించేందుకు హైకోర్టు ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.. అయితే, ఓజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది.. “చాలా మంది చాలా చేస్తున్నారు.. ఉసురు తగులుతుంది అని..” నాకు న్యాయం జరగపోతే నా ఉసురు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు తగులుతుంది అంటూ శాపనార్థాలు పెట్టారు..
అన్ని పార్టీలను, అందరు నాయకులను స్వయంగా కలసి విన్నవిస్తా.. వైఎస్ షర్మిల కూడా స్పందించాలన్నారు పార్వతి.. నాకు జరిగిన అన్యాయంపై స్పందించిన వైసీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. వీల్ చైర్ యాత్ర చేస్తానంటే అడ్డుకున్నారు.. చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్ వీల్ చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు.. 16వ తేదీ ప్రధాని మోడీ కర్నూలు వస్తున్నారు.. మోడీని కలసి విన్నవించే ప్రయత్నం చేస్తా… మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించండి అని కోరారు.. మోడీని కలవడానికి అనుమతించకుంటే 13, 14, 15 తేదీలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా.. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!