Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- కర్నూలు బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసిన పోలీసులు..
- మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు ప్రమాదం జరిగింది: ఎర్రిస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం ఘటన లో రెండవ కేసు నమోదు అయింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా.. శివ శంకర్ పై కేసు నమోదు చేశారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనింది.. శివ శంకర్ స్పాట్ లో చనిపోయాడు.. నేను గాయాలతో బయట పడ్డాను అని చెప్పుకొచ్చారు. అయితే, అతడి డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది.. దీంతో బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి వెల్లడించాడు.
Read Also: Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు వేగవంతం చేశారు. నంద్యాల జిల్లాలో 66 కేసులు పెట్టి రూ. 28,400 ఫైన్ వేయగా.. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 జరిమానా విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు పెట్టడంతో పాటు రూ. 2,40,000 జరిమానా వేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు పెట్టి రూ. 2,32,100 ఫైన్, కర్నూలు జిల్లాలో 14 కేసులు పెట్టి 72,050 ఫైన్ వేసి, మోటార్ వెహికల్ ట్యాక్స్ 96,000 అధికారులు కలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి ఒక బస్సు సీజ్ చేయగా, అన్నమయ్య జిల్లాలో 21 కేసులు పెట్టి 6 బస్సులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కేసులు పెట్టి 3 బస్సులు సీజ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 8 కేసులు పెట్టి 4 బస్సులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!