Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- కర్నూలు బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేసిన పోలీసులు..
- మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు ప్రమాదం జరిగింది: ఎర్రిస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Accident: కర్నూలు బస్ దగ్ధం ఘటన లో రెండవ కేసు నమోదు అయింది. ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా.. శివ శంకర్ పై కేసు నమోదు చేశారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనింది.. శివ శంకర్ స్పాట్ లో చనిపోయాడు.. నేను గాయాలతో బయట పడ్డాను అని చెప్పుకొచ్చారు. అయితే, అతడి డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది.. దీంతో బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి వెల్లడించాడు.
Read Also: Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
మరోవైపు, కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు వేగవంతం చేశారు. నంద్యాల జిల్లాలో 66 కేసులు పెట్టి రూ. 28,400 ఫైన్ వేయగా.. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 జరిమానా విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు పెట్టడంతో పాటు రూ. 2,40,000 జరిమానా వేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు పెట్టి రూ. 2,32,100 ఫైన్, కర్నూలు జిల్లాలో 14 కేసులు పెట్టి 72,050 ఫైన్ వేసి, మోటార్ వెహికల్ ట్యాక్స్ 96,000 అధికారులు కలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి ఒక బస్సు సీజ్ చేయగా, అన్నమయ్య జిల్లాలో 21 కేసులు పెట్టి 6 బస్సులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కేసులు పెట్టి 3 బస్సులు సీజ్ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 8 కేసులు పెట్టి 4 బస్సులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!