Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షం..
- మూడు 'సీ'లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది..
- ఆ మూడు 'సీ'లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ..
- అప్పుడే దేశం బాగుపడుతుందన్న రఘువీరారెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghuveera Reddy: మూడు ‘సీ’లు కలిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.. ఆ మూడు ‘సీ’లే.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కంట్రీ కలవాలి.. అప్పుడే దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి.. కర్నూలులో జరుగుతోన్న ఏఐకేఎస్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఆలిండియా కిసాన్ సభ 90 ఏళ్ల క్రితం ఏర్పాటైంది.. స్వాతంత్రానికి పదేళ్ల ముందే స్థాపించి స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి రైతు సంఘం ఏఐకేఎస్ అన్నారు.. నేడు వ్యవసాయ మంత్రిగా ఉన్నపుడు రైతు సంఘాలతో చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు.. బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ రూ. 1860 ఉంటే రూ.600కి తగ్గించామని.. ఆ నిర్ణయంతో బీటీ విత్తనాలపై రూ.60 వేల కోట్లు రైతులకు ఆదా అయినట్టు వెల్లడించారు.. రైతుల విషయంలో కమ్యూనిస్టుల ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన ఒకటే అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి..
Read Also: Kasireddy Rajasekhar Reddy: హైకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురు!
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
మరోవైపు.. దేశాన్ని కాపాడే శక్తి అవునన్నా కాదన్నా కాంగ్రెస్, కమ్యూనిస్టులకే ఉంది అన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ప్రధాని మోడీ నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ పుట్టి వందేళ్లు అయ్యింది.. కమ్యూనిస్టు పార్టీ పుట్టి వందేళ్లు అయ్యింది.. కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు ఒక్కరైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా..? ఉద్యమాలు చేసారా..? ప్రాణత్యాగం చేశారా..? అని ప్రశ్నించారు.. దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్ పార్టీలు అన్ని కలవాలి, పోరాడాలని పిలుపునిచ్చారు.. ఇక, గత ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు వస్తాయని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ఆ సీట్లు వచ్చింటే రాజ్యాంగం వచ్చిందేది కాదు అన్నారు.. అందరూ కలసి బతుకుతున్నామంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణంగా చెప్పుకొచ్చారు రామకృష్ణ..
తాజావార్తలు
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!