Kurnool Bus Tragedy: 19 మంది సజీవదహనం.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన హోం మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Jubilee Hills Bypoll : ముగిసిన నామినేషన్స్ విత్డ్రా.. బరిలో ఎంతమందంటే.?
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ఈ ఘటన చాలా దురదృష్టకర సంఘటనని.. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఆమె వివరించారు. మంటలు చెలరేగగానే అప్రమత్తమై 27 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోగలిగారని, ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. మృతుల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని ఆమె ప్రకటించారు.
Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
మరోవైపు, మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించి, వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!