Kurnool Bus Tragedy: 19 మంది సజీవదహనం.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన హోం మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Tragedy: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Jubilee Hills Bypoll : ముగిసిన నామినేషన్స్ విత్డ్రా.. బరిలో ఎంతమందంటే.?
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
ఈ ఘటన చాలా దురదృష్టకర సంఘటనని.. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఆమె వివరించారు. మంటలు చెలరేగగానే అప్రమత్తమై 27 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోగలిగారని, ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. మృతుల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ ప్రమాదంపై ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని ఆమె ప్రకటించారు.
Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
మరోవైపు, మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించి, వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!