YS Jagan: పతనమైన ఉల్లి, టమాటా ధరలు.. చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్!
- పతనమైన ఉల్లి, టమాటా ధరలపై స్పందించిన జగన్..
- ధరల పతనంలో చంద్రబాబు రికార్డు ఎవ్వారికి సాధ్యం కాదు..
- కర్నూలులో కిలో ఉల్లి రూ.3, రూపాయిన్నరకే కిలో టమాటానా: వైఎస్ జగన్
YS Jagan: ఏపీలో ఉల్లి, టమోటా రైతుల దీన స్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు. ఉల్లి, టమోటా రైతుల వీడియోలతో ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు అని ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలేనా?, రూపాయిన్నరకే కిలో టమోటానా? ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. ఇంతకీ రైతు అనేవాడు బతకొద్దా?.. గత కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? అని వైఎస్ జగన్ అడిగారు.
Read Also: Online Game: ఆన్లైన్ గేమ్లో రూ.13 లక్షలు పోగొట్టిన 6వ తరగతి విద్యార్థి.. కట్చేస్తే..
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!
- Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
ఇక, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? అని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం?.. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు.. కానీ, తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు.. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? అని అడిగారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Uttar pradesh: నెట్టింట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడి అసభ్యకర వీడియో..
అయితే, రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అడిగారు. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు?.. ఇది మీ తప్పు కాదా చంద్రబాబూ? అన్నారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం బాధాకరం అని చెప్పుకొచ్చారు. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు.. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు.. చంద్రబాబు తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అని వైఎస్ జగన్ కోరారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!