Online Game: ఆన్లైన్ గేమ్లో రూ.13 లక్షలు పోగొట్టిన 6వ తరగతి విద్యార్థి.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Game: లక్నోలోని మోహన్లాల్గంజ్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బీఐపీఎస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్(12) అనే బాలుడు ఆన్లైన్ గేమ్లో భారీ మొత్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. యష్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. అతను రెండు సంవత్సరాల క్రితం తన భూమిని అమ్మి యూనియన్ బ్యాంక్ బిజ్నోర్ బ్రాంచ్లో రూ.13 లక్షలు డిపాజిట్ చేశాడు. సోమవారం, సురేష్ తన పాస్బుక్ను అప్డేట్ చేశాడు. ఖాతాలోని రూ. 13 లక్షలు ఖాళీ అయినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. దర్యాప్తు చేపట్టగా.. ఆన్లైన్ గేమింగ్ లావాదేవీల ద్వారా డబ్బు ఖర్చు చేసినట్లు తేలింది.
READ MORE: Uttar pradesh: నెట్టింట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడి అసభ్యకర వీడియో..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
దీంతో ఇంటికి తిరిగి వచ్చిన సురేష్ తన కొడుకు యష్ను దీని గురించి అడిగాడు. ఫ్రీ ఫైర్ ఆడుతూ.. రూ. 13 లక్షలను డబ్బును కోల్పోయానని యష్ ఒప్పుకున్నాడు. అయినప్పటికీ.. తండ్రి తన కొడుకును తిట్టలేదు. బదులుగా అతనికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇది తప్పని బాలుడికి వివరించాడు. కానీ ఈ ఘటన తర్వాత మనస్తాపానికి గురైన యష్ తన గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే యష్ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. యష్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. కొడుకు మరణ వార్త విని తల్లి విమల స్పృహ కోల్పోయింది. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!