Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Buggana Rajendranath Reddy Responds To The Union Budget 2025

Buggana Rajendranath: అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు.. కూటమి సర్కార్‌పై బుగ్గన విసుర్లు

Published Date :February 1, 2025 , 6:07 pm
By Suresh Maddala
  • అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు
  • కూటమి సర్కార్‌పై బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విసుర్లు
Buggana Rajendranath: అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదు.. కూటమి సర్కార్‌పై బుగ్గన విసుర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. నిర్మలమ్మ బడ్జె్ట్ సంతృప్తి నివ్వలేదన్నారు. బడ్జెట్‌లో ఏపీ కంటే బీహార్‌కే ఎక్కువ కేటాయింపులు జరిగాయన్నారు. 12 ఎంపీ సీట్లు ఉన్న జేడీయూ.. బీహార్‌ కోసం ఎంతో సాధించింది. అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న ఏపీ మాత్రం ఏమి సాధించలేకపోయిందని ధ్వజమెత్తారు. 16 సీట్లతో మీరేమి సాధించారని కూటమి సర్కార్‌ను ప్రశ్నించారు. అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ ఎద్దేవా చేశారు.

‘‘గతంలో విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం ట్యాబ్ ఇస్తే విమర్శించారు. బడ్జెట్‌లో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మెడికల్ సీట్లు కేంద్రం 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో 2,500 ఏపీలోనే ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇపుడు ఆ కాలేజీ నిర్మాణాలు నిలిపివేయాలని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. ఆదాయపు పన్ను రూ.12 లక్షల వరకు మధ్య తరగతికి మినహాయించడం మంచి పరిణామం. కేంద్రానికి చంద్రబాబు అవసరం ఉంది.. గతంలో వైసీపీ మద్దతు కేంద్రానికి అవసరం లేదు. ఇప్పుడు టీడీపీ 16 సీట్లు బీజేపీకి అవసరం ఉంది. అయినా ఒక్కటి కూడా చంద్రబాబు సాధించలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు135 మీటర్ల వరకు పూర్తి చేయడానికి అంగీకరించినట్టు అర్థం వచ్చేలా ఉంది. 150 మీటర్లు నిర్మిస్తేనే పోలవరం ప్రాజెక్టు ఉపయోగం ఉంటుంది.’’ అని బుగ్గన అన్నారు.

‘‘తలసరి ఆదాయం తగ్గిందని చంద్రబాబు అంటున్నారు.. రాజకీయంగా ఉపయోగపడచ్చు… రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. వాల్మీకి చెట్టుకొమ్మను కొట్టుకున్నట్టు చేస్తున్నారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ బాగున్నవాటికి మేము కూడా థాంక్స్ చెబుతున్నాం. ఏపీకి ఏమి సాధించారు. స్టీల్ ప్లాంట్‌కి పెట్టుబడి సాయం మాత్రమే కాదు…సొంత గనులు కావాలి.’’ అని బుగ్గన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Thandel Jathara :”తండేల్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్.. వేదిక ఖరారు.. వారికి మాత్రం నో ఎంట్రీ..

శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.

స్వాగతించిన చంద్రబాబు
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయం అని కొనియాడారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కితాబు ఇచ్చారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Buggana Rajendranath Reddy
  • chandrababu
  • Responds
  • tdp
  • Union Budget 2025

తాజావార్తలు

  • ICC T20 World Cup: ఏంటి..! టీమిండియాకు ఇచ్చిన ట్రోఫీ ఒరిజినల్ కాదా? షాకింగ్ నిజం..

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు బిగ్ ట్విస్ట్

  • SAP Chairman-Bollineni Chandrika: అనారోగ్యంతో బాధపడుతున్న క్రీడాకారిణి చంద్రిక.. శాప్ చైర్మన్ ఆర్థిక సహాయం!

  • Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో సామాన్యుడికి బెస్ట్ ఆప్షన్స్.. ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 5 బైకుల లిస్ట్ ఇదిగో..!

  • Hardik Pandya: నా సక్సెస్‌కు కారణం ఆమె.. ఇంకా పదేళ్లు ఆడుతా, పది ట్రోఫీలు గెలుస్తా!

  • Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions