Nara Bhuvaneswari Nimmakuru visit: నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటన.. గత స్మృతులను స్మరించుకొని..!
- నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటన..
- విద్యార్థుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తలకించిన భువనేశ్వరి..
- విద్యార్థుల ప్రతిభను అభినందించిన భువనేశ్వరి
Nara Bhuvaneswari Nimmakuru visit: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పామర్రు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు.. స్థానికంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు.. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి.. చిన్ననాడు నిమ్మకూరులో గత స్మృతులను స్మరించుకున్నారు. వేసవి సెలవుల్లో నిమ్మకూరు వచ్చే వారని, సోదరితో కలిసి బస్సులో సినిమాకి పామర్రు వరకు వెళ్లే వాళ్లమని విషయాలను పంచుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఎదగాలని కోరారు.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించిన భువనేశ్వరి, చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల శ్రమ, ప్రతిభను గౌరవిస్తూ.. “మీ విజ్ఞానం మీకు దారి చూపుతుంది. మీరు చేస్తున్న ప్రతి పని రేపటి విజయానికి పునాది.” అని చెప్పారు.
Also Read
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
- Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!
ఇక, భువనేశ్వరి మాట్లాడుతూ.. నిమ్మకూరు నా తాతల ఊరు. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా తల్లి, మా బంధువులతో ఇక్కడే ఉండేవాళ్లం.. మా సోదరి శారద కూడా ఇక్కడే ఉండేది. ఆర్టీసీ బస్సులో ‘పామర్రు’ సినిమాకి వెళ్ళేవాళ్లం.”.. “పదేపదే కాలం మార్చినా, జీవితం ముందుకు సాగుతూనే ఉంది.”. అని చెప్పింది, వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు.. భువనేశ్వరి విద్యార్థుల పట్ల అవసరంపై గొప్ప మెసేజ్ ఇచ్చారు.. ఆంగ్లంలోనూ మీ ప్రతిభను కనబర్చండి. “బాలికలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి.” “సమాజాన్ని, దేశాన్ని నెట్టిగించేలా విద్య పొందాలి.” “పేదరికంలో కూడా చదువినవారు ఎలా ఎదిగారో, ఆ కథ మీరు స్పూర్తిగా తీసుకోవాలి.” అని విద్యార్థులకు ఉత్తేజంతో చెప్పారు.
స్కూల్ లోని సమస్యలను సీఎం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తానని భువనేశ్వరి పాఠశాల అన్ని అభివృద్ధి అంశాలను పట్టణ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. నిమ్మకూరులో రూ.3.50 కోట్లు విలువైన దాతుల విరాళాలతో నిర్మించిన హాస్టల్ భవనాన్ని కూడా ప్రారంభించిన భువనేశ్వరి, “ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను ఎంత చేయాలో అంతం లేదు. మమ్ముల మీద పెట్టిన నమ్మకంతో చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు.” అని చెప్పారు. మరోవైపు.. సీఎం చంద్రబాబు కూడా చాలా కష్టపడి చదువుకున్నారు. పాఠశాల చదువును ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నమ్మకంతో అన్ని బాధ్యతలను చేపట్టి, విడివిడిగా ఎనిమిది డిజిటల్ సేవలతో ప్రజలకు సేవ చేస్తున్నాం అని పేర్కొన్నారు. నిమ్మకూరు పర్యటనలో నారా భువనేశ్వరి తన బలమైన మాటలు, విద్యాకే ప్రాధాన్యతను గుర్తుచేసే సందేశాలు, విద్యార్థుల మధ్య వెలుగులు నింపేలా ఉంటాయి. ఈ సందర్శన స్థానికులకు సామాజిక, విద్యా రంగాలకు కొత్త ప్రేరణగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో