Minister Nara Lokesh: అశోక్ లేలాండ్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి లోకేష్..
- కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో మంత్రి లోకేష్ పర్యటన..
- అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ప్రారంభించిన మంత్రి..
- అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్గా నిలిచిన అశోక్ లేలాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ను ప్రారంభించారు మంత్రి నారా లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్ ప్లాంట్గా నిలిచింది అశోక్ లేలాండ్.. ఈ యూనిట్లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్.. ఈ ప్లాంట్ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.. ఇక, ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనుండా.. ఫేజ్-2లో 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు..
Read Also: Kannappa : కన్నప్ప నుంచి మహాదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్..
Also Read
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ఇక, ఈ పర్యటనలో అభయాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు.. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించడానికి ముందు అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్ కు ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రి లోకేష్ ఆలయానికి వచ్చిన సమయంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక, అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్.. ఏపీ ప్రభుత్వంపై నమ్మకంతో 90 రోజుల్లోనే యూనిట్ ను ప్రారంభించిన అశోక్ లేలాండ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.. మహారాష్ట్రకు ముంబై, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంది.. మరి ఏపీకి ఏముంది అని అడిగారు.. దానికి ఒక్కటే చెప్పా.. మా బ్రాండ్ చంద్రబాబు అని చెప్పాను అని గుర్తుచేసుకున్నారు నారా లోకేష్..
తాజావార్తలు
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?