Jana Sena: జనసేన వినూత్న నిరసన.. జూదం, గుండాట, పేకాట మాకొద్దు..!
- జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన..
- కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో ఆందోళన..
- బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Sena: జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక్కడ కొన్ని కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. మా అప్పాపురం గ్రామంలో జరుగుతున్న ఈ హింసాత్మక ఆటలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో మందెపు రాయుళ్లు, నేర చరిత్రగలవారు వస్తుంటారని విమర్శించారు.
Read Also: Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. తల్లితో ప్రియాంక.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
మా అంపాపురం గ్రామం జాతీయ రహదారి వెంబడి ఉండటం వలన జూదం ఆడేందుకు వేళల్లో కార్లు, బైకుల్లో వచ్చి జాతీయ రహదారిపై భారీగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలగిస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్.. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. చుట్టూ ఉన్న పంట పొలాల్లో మద్యం సేవించి మద్యం బాటిళ్లు పగలగొట్టి పొలాలలోకి విసరిస్తున్నారు, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మేం సంప్రదాయకంగా నిర్వహించే కోడిపందాలకు వ్యతిరేకం కాదు… కానీ, మా ఊర్లో పేకాట, గుండాట, హింసాత్మక పందాలు నిర్వహించవద్దని ఎస్పీ, డీఎస్పీ , వీరవల్లి పోలీస్స్టేషన్లో, టీడీపీ కేంద్ర కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి రోజున, ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిరసన తెలియజేస్తున్నాం.. గత సంవత్సరం నిర్వహించిన పందాలలో మా ఊరు యువకుల్ని కొంతమంది కొట్టి దౌర్జన్యంగా ఫోన్లు లాక్కుని హింసించారు.. దయచేసి పేకాట, గుండాట, హింసాత్మక కోడిపందాలు మా అంపాపురం గ్రామంలో నిర్వహించవద్దని గ్రామస్తులందరం కోరుకుంటున్నామని విజ్ఞప్తి చేశారు బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!