Jana Sena: జనసేన వినూత్న నిరసన.. జూదం, గుండాట, పేకాట మాకొద్దు..!
- జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన..
- కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో ఆందోళన..
- బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Sena: జూదం, గుండాట, పేకాట మాకొద్దు అంటూ జనసేన వినూత్న నిరసన చేపట్టింది.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం పంచాయతీ పరిధిలో బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అంపాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంప్రదాయకంగా జరగవలసిన ఆటల పోటీలను కలుషితం చేస్తున్నారని.. సంక్రాంతి పండగను అడ్డం పెట్టుకుని గుండాట, పేకాట, కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక్కడ కొన్ని కోట్లలో బెట్టింగులు జరుగుతాయి. మా అప్పాపురం గ్రామంలో జరుగుతున్న ఈ హింసాత్మక ఆటలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో మందెపు రాయుళ్లు, నేర చరిత్రగలవారు వస్తుంటారని విమర్శించారు.
Read Also: Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. తల్లితో ప్రియాంక.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
మా అంపాపురం గ్రామం జాతీయ రహదారి వెంబడి ఉండటం వలన జూదం ఆడేందుకు వేళల్లో కార్లు, బైకుల్లో వచ్చి జాతీయ రహదారిపై భారీగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలగిస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్.. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని.. చుట్టూ ఉన్న పంట పొలాల్లో మద్యం సేవించి మద్యం బాటిళ్లు పగలగొట్టి పొలాలలోకి విసరిస్తున్నారు, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మేం సంప్రదాయకంగా నిర్వహించే కోడిపందాలకు వ్యతిరేకం కాదు… కానీ, మా ఊర్లో పేకాట, గుండాట, హింసాత్మక పందాలు నిర్వహించవద్దని ఎస్పీ, డీఎస్పీ , వీరవల్లి పోలీస్స్టేషన్లో, టీడీపీ కేంద్ర కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి రోజున, ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిరసన తెలియజేస్తున్నాం.. గత సంవత్సరం నిర్వహించిన పందాలలో మా ఊరు యువకుల్ని కొంతమంది కొట్టి దౌర్జన్యంగా ఫోన్లు లాక్కుని హింసించారు.. దయచేసి పేకాట, గుండాట, హింసాత్మక కోడిపందాలు మా అంపాపురం గ్రామంలో నిర్వహించవద్దని గ్రామస్తులందరం కోరుకుంటున్నామని విజ్ఞప్తి చేశారు బాపులపాడు జనసేన మండల కార్యదర్శి కందుకూరి శ్రీధర్.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!