High tension in Gudivada: గుడివాడలో హై టెన్షన్.. వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు..
- గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు..
- పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడలో కొనసాగుతున్న టెన్షన్..
- నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గత రెండు రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుడివాడలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేకించి నాగవరప్పాడు జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఫ్లెక్సీ చించకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
Read Also: Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
అయితే, గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద టీడీపీకి చెందిన మరో వివాదాస్పద ఫ్లెక్సీని వైసీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ల దగ్గర ఉంటానని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్ను గుర్తు చేస్తూ టీడీపీ కార్యకర్తల తరఫున మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Read Also: Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్గా..!
మరోవైపు, వైసీపీ కార్యక్రమానికి హాజరుకావాల్సిన కొడాలి నాని అనారోగ్య కారణాలతో దూరంగా ఉన్నారు. కానీ, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్కు హాజరై, సంతకం చేసిన వెంటనే హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుడివాడ K కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని.. జై రాము, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే రాము ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ పరిణామాలతో గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!