High tension in Gudivada: గుడివాడలో హై టెన్షన్.. వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు..
- గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలు..
- పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడలో కొనసాగుతున్న టెన్షన్..
- నాగవరప్పాడులో ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గత రెండు రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుడివాడలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేకించి నాగవరప్పాడు జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఫ్లెక్సీ చించకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
Read Also: Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
అయితే, గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద టీడీపీకి చెందిన మరో వివాదాస్పద ఫ్లెక్సీని వైసీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ల దగ్గర ఉంటానని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్ను గుర్తు చేస్తూ టీడీపీ కార్యకర్తల తరఫున మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Read Also: Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్గా..!
మరోవైపు, వైసీపీ కార్యక్రమానికి హాజరుకావాల్సిన కొడాలి నాని అనారోగ్య కారణాలతో దూరంగా ఉన్నారు. కానీ, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా గుడివాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్కు హాజరై, సంతకం చేసిన వెంటనే హైదరాబాద్కు బయలుదేరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుడివాడ K కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని.. జై రాము, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే రాము ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ పరిణామాలతో గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..