Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Deputy Cm Pawan Kalyan Visits Cyclone Hit Paddy Fields In Koduru

AP Deputy CM Pawan: నష్టపోయిన పంటను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్..

Published Date :October 30, 2025 , 12:26 pm
By Chandra Shekhar Pamena
  • కృష్ణా: అవనిగడ్డలోని కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
  • తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత రైతులను పరామర్శించిన పవన్..
  • రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్..
AP Deputy CM Pawan: నష్టపోయిన పంటను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Deputy CM Pawan: కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బ తిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు.

Read Also: Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్

Also Read

  • Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్‌గా రికార్డ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు..!
  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..
  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!
  • Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!

అలాగే, తుఫాన్ కారణంగా నష్టపోయామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. ఎకరానికి 30 వేల రూపాయలు ఖర్చు అయ్యింది.. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది.. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం.. కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని వేడుకున్నారు. రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కి కలెక్టర్ బాలాజీ వివరించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం.. ఎవరూ ఆందోళన చెందకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

అయితే, ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్ట నివారణ కొంత వరకు తగ్గించామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. చంద్రబాబు ముందు చూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.. ప్రజలకు ఎలర్ట్ మెసేజులు కూడా పంపాం.. పంచాయతీ రాజ్ శాఖ‌ పరిధిలో బాగా నష్టం జరిగింది.. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారు.. 46 వేల హెక్టార్లలో వరి, 14 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయి.. కోయ సుబ్బారావు చెట్టు మీద పడి చనిపోవడం బాధాకరం అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నాం.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాం.. ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇక, డ్రైన్ల పూడిక తీతల ద్వారా నీరు నిల్వ లేకుండా చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్ చెప్పిన సమస్యలు పరిష్కరిస్తాం.. ముందస్తుగా తీసుకున్న చర్యలు వల్ల నేడు నష్టం చాలా వరకు తగ్గింది.. ఆక్వా రైతులు ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి.. సీఎంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో రోడ్లు పాడైతే యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తాం.. రెండు రోజుల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసేలా వేలాది మంది సిబ్బంది పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh News
  • AP Deputy CM visit
  • AP government support
  • crop damage AP
  • Cyclone Monta impact

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions