AP Deputy CM Pawan: నష్టపోయిన పంటను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్..
- కృష్ణా: అవనిగడ్డలోని కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
- తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత రైతులను పరామర్శించిన పవన్..
- రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Deputy CM Pawan: కృష్ణా జిల్లాలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంట పొలాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి దెబ్బ తిన్న వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ తో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు.
Read Also: Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యుడి వ్యాఖ్యలపై భాను ప్రకాష్ రెడ్డి ఫైర్
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
అలాగే, తుఫాన్ కారణంగా నష్టపోయామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రైతులు తెలిపారు. ఎకరానికి 30 వేల రూపాయలు ఖర్చు అయ్యింది.. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది.. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాం.. కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు సాయం అందేలా చూడాలని వేడుకున్నారు. రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పవన్ కి కలెక్టర్ బాలాజీ వివరించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం.. ఎవరూ ఆందోళన చెందకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అయితే, ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్ట నివారణ కొంత వరకు తగ్గించామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. చంద్రబాబు ముందు చూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.. ప్రజలకు ఎలర్ట్ మెసేజులు కూడా పంపాం.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగింది.. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారు.. 46 వేల హెక్టార్లలో వరి, 14 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయి.. కోయ సుబ్బారావు చెట్టు మీద పడి చనిపోవడం బాధాకరం అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నాం.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాం.. ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇక, డ్రైన్ల పూడిక తీతల ద్వారా నీరు నిల్వ లేకుండా చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు. మండలి బుద్ధప్రసాద్ చెప్పిన సమస్యలు పరిష్కరిస్తాం.. ముందస్తుగా తీసుకున్న చర్యలు వల్ల నేడు నష్టం చాలా వరకు తగ్గింది.. ఆక్వా రైతులు ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి.. సీఎంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో రోడ్లు పాడైతే యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తాం.. రెండు రోజుల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసేలా వేలాది మంది సిబ్బంది పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!