Kottu Satyanarayana: టీడీపీ హయాంలో ఆక్రమణలు విపరీతంగా జరిగాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana Review Meeting In Simhachalam: టీడీపీ హయాంలో ఆక్రమణలు విపరీతంగా జరిగాయని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. సింహాచలంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పదాలు ఇప్పుడు దేవదాయ శాఖకు తలనొప్పిగా మారాయని వ్యాఖ్యానించారు. సింహాచలం భూముల పరిరక్షణపై తాము పూర్తి దృష్టి పెట్టామని.. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కొంత నష్టం జరిగిందని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం పరిధిలో 18 బీట్లు ఉన్నాయని.. ఇకపై ఆక్రమణలు జరిగితే ఆ ప్రాంత అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. పంచగ్రామ భూ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. భూ సమస్య విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. నృసింహ యాగం క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
అంతకుముందు.. ఏపీలోని అన్ని దేవాలయాల్లో త్వరలోనే ‘టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని సత్యనారాయణ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని.. ఈ విధానం ద్వారా దర్శన టికెట్లు, పూజలు, కానుకలు తదితర సేవలన్నీ ఆన్లైన్ ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 16 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. రాష్ట్రంలోని మరో 185 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల పథకం మంజూరు చేయనున్నారని పేర్కొన్నారు. ఆలయాలకు వచ్చే ఆదాయం, వ్యయాలు, ఇతర రాబడులపై కూడా.. పటిష్టమైన ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ను తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!