Kottu Satyanarayana: శ్రీశైలంలో చౌల్ట్రీలపై దేవస్థానానిదే అజమాయిషీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైల దేవస్థాన పరిధిలోని వివిధ కులాల చౌల్ట్రీలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండేలా ఓ విధానం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం అన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రూముల కేటాయింపులు మొదలుకుని చౌల్ట్రీల్లో అందించే సేవల వివరాలను దేవస్థానానికి తెలిపేలా చర్యలు తీసుకుంటాం.రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలను దేవస్ఖానమే కల్పిస్తోందన్నారు. ఆ మేరకు చౌల్ట్రీలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండాలని భావిస్తున్నాం. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు ఎలాంటి అవమానం జరగలేదన్నారు.
ఓ ఎమ్మెల్యే లోపల దర్శనం చేసుకుంటున్నారని ముత్యాల నాయుడు కాసేపు ఆగారు. అద్భుతమైన దర్శనం జరిగిందని బూడి ముత్యాల నాయుడు నాతో చెప్పారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో అభివృద్ది చేయాలంటే అటవీ శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలం అభివృద్ధికి అటవీ, రెవెన్యూ శాఖల నుంచి వచ్చే ఇబ్బందుల పరిష్కారంపై మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మానతో సమావేశం అయ్యాం. శ్రీశైలం దేవస్థానం నుంచి ఏడు చదరపు మైళ్ల మేర భూమిని దేవస్థానానికి కేటాయించారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
Read Also: Rohit Sharma: రో‘హిట్’.. ధోనీ రికార్డ్ బ్రేక్
దాదాపు 4130 ఎకరాల భూమి ఏడు చదరపు మైళ్ల పరిధిలో ఉంటుంది. అలాగే ఇంకొంత భూమిని వివిధ జీవోల ద్వారా భూమిని దేవస్థానానికి కేటాయించారు. అయితే సరిహద్దులు ఫిక్స్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గతంలోని జీవోల ప్రకారం బౌండరీలు ఫిక్స్ చేయడానికి నిర్ణయించాం. అక్టోబర్ నెలాఖరు నాటికి బౌండరీలు ఫిక్స్ చేయనున్నాం అని చెప్పారు. దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఎంత భూమి కావాలో నిర్ధారించుకుంటాం. అలాగే ఎకో టూరిజం, రెలిజియస్ టూరిజం అభివృద్ధి చేస్తాం అన్నారు.
వైల్డ్ లైఫ్ శాంక్చురీకి, రిజర్వ్ ఫారెస్టుకు ఇబ్బంది కలగకుండా శ్రీశైల దేవస్థాన అభివృద్ధి చేపడతాం. శ్రీశైల దేవస్థానాన్ని.. దేవస్థాన పరిధిలోని భూభాగాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనేది మా ఉద్దేశ్యం కాదన్నారు. దేవస్థాన అభివృద్ధికి అటవీ భూమి అవసరమైతే.. రెండింతల మేర దేవస్థాన భూమిని అటవీ శాఖకు బదలాయించే నిబంధన పైన చర్చిస్తున్నాం అని వివరించారు కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!