Kodali Nani: మార్చి 22 ఉగాదిన సీఎం జగన్ చేతుల మీదుగా టిడ్కో ఫ్లాట్ల ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani On Tidco Plots: మార్చి 22న ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టిడ్కో ఫ్లాట్లను ప్రారంభిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. నిర్మాణాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని అన్నారు. గుడివాడ మల్లాయిపాలెం లే-అవుట్లోని టిడ్కో ఫ్లాట్లు, జగనన్న హౌసింగ్ కాలనీను కొడాలి నానితో పాటు కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. లే అవుట్లో జరుగుతున్న అభివృద్ధిని కలెక్టర్ యంత్రాంగం ఆ ఇద్దరికి వివరించింది. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. నాడు పెద్ద మనసుతో వైయస్సార్, నేడు జగన్మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నిజం చేస్తున్నారన్నారు. టిడిపి హయాంలో నామమాత్రంగానే టిడ్కో నిర్మాణాలు జరిగాయని విమర్శించారు. జగనన్న కాలనీలో మెటల్ రోడ్ల నిర్మాణాలకు 8 కోట్ల మంజూరు అయ్యాయని తెలిపారు. టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవ సభలో గుడివాడకు ఏం చేశారో ముఖ్యమంత్రి వివరంగా చెప్తారన్నారు. గుడివాడ శివారు కాలనీల అభివృద్ధికి రూ.26 కోట్లు మంజూరు చేశామన్నారు. గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో త్రాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ. 160 కోట్లతో టెండర్ పూర్తయ్యిందన్నారు. గుడివాడలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు వివిధ దశలో ఉన్నాయన్నారు.
Bopparaju Venkateswarlu: ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు.. హక్కుల కోసం న్యాయపోరాటం
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
అంతకుముందు.. ఏపీలో రాబోయే ఎన్నికలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. 175కి 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. టీడీపీ , జనసేన కలిసి వస్తే 18 చోట్ల మాత్రమే టైట్ ఫైట్ నడుస్తుందని అన్నారు. కేవలం 18 చోట్ల మాత్రమే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని.. మిగిలిన అన్ని చోట్లా వార్ వన్ సైడేనని జోస్యం చెప్పారు. జగన్ ఎవరిని నిలబెడితే, వారే తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వారు ఎన్ని నిందలేసినా ప్రజల కోసం సీఎం భరిస్తున్నారన్నారు. ఇక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత రాష్ట్రానికి భారీగా పరిశమ్రలు వస్తాయన్నారు. అలాగే.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పేదవాడి ఆర్థిక బలోపేతానికి సీఎం జగన్ సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేస్తున్నారని.. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలను పేదవారి కోసం ఏపీలో మాత్రమే అందిస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి అంటే రోడ్లు వేయటం నిర్మాణాలు కట్టడమే కాదని.. ప్రతి పేదవాడిని ఆర్థికంగా బోలోపేతం చేయడమని వివరించారు.
MLC Kavitha on IT HUB: నిజామాబాద్లో త్వరలో ఐటీ హబ్ ప్రారంభం
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!