Kodali Nani: ఎన్టీఆర్ ప్రజా నాయకుడు.. ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయగా మంత్రి జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రజా నాయకుడు అని.. ఆయన ఏ పార్టీకి చెందినవారు కాదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అని నిలదీశారు. బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది తానేనని.. టీడీపీ వాళ్ళే తన పేరు తీసేసే ప్రయత్నం చేశారని కొడాలి నాని ఆరోపించారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగులైనా వేసుకోవచ్చన్నారు. చంద్రబాబు వస్తాడు.. వెళ్తాడని.. తన చిన్నప్పటి నుంచి గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని.. తనను ఓడించినా, గెలిపించినా గుడివాడ నియోజకవర్గ ప్రజలే చేయగలరని కొడాలి నాని అన్నారు. సొంత కొడుకునే గెలిపించలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
Read Also: Nellore District: బీజేపీ మహిళా నేతపై వైసీపీ నాయకుడి దాష్టీకం
మరోవైపు ఈ సమావేశంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి గుడివాడలో పోటీ చేసినా విజయం కొడాలి నానిదే అని ధీమా వ్యక్తం చేశారు. కొడాలి నాని ఎంతో ప్రజాభిమానం సంపాదించారని, ప్రతిసారి మెజార్టీ పెరుగుతోందని కొనియాడారు. రానున్న ఎన్నికల్లోనూ కొడాలి నాని ఎమ్మెల్యే అవుతారని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ బాలశౌరి జోస్యం చెప్పారు. అటు ఎంత మంది వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నానిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వెళ్లాలనుకున్నానని.. కొడాలి నాని తన స్నేహితుడు అని చెప్పుకోవటానికి జీవితాంతం గర్వపడతానని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు అని పేర్ని నాని ప్రశంసలు కురిపించారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..