Kodali Nani: పురందేశ్వరి వాటిని అడ్డుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ మాటెత్తితే అంతెత్తున లేస్తారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని). చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ నేతల్ని ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది ఈసారి నానిగారి టార్గెట్ మారింది. బీజేపీ నేతలపై ఆయనన విమర్శలు చేస్తున్నారు. గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారని, అదే హోదాతో ఆమె గుడివాడకు మంజైరైన ఫ్లై ఓవర్లను అడ్డుకుంటున్నారని నాని ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఈ మేరకు సోమవారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించారు కొడాలి నాని. ఇప్పటికైనా గుడివాడ అభివృద్ది పనులను అడ్డుకునే ప్రయత్నాలను విరమించాలని ఆయన పురందేశ్వరికి సూచించారు. లేనిపక్షంలో పురందేశ్వరి తీవ్ర పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని నాని వార్నింగ్ ఇచ్చారు. గుడివాడ ప్రజానీకం రైల్వే గేట్ల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారని నాని చెప్పారు. ఎంపీ బాలశౌరి లోక్ సభలో ఫ్లై ఓవర్లు కట్టాలని కోరారన్నారు.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
సీఎం జగన్ కూడా రెండు ఫ్లై ఓవర్లు శాంక్షన్ చేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారన్నారు. ఈ నెల 26న టెండర్లు ఓపెన్ చేయాల్సి వుందన్నారు. అయితే పురందేశ్వరి అక్కడ వున్న షాపులు, పెట్రోల్ బంకుల వారికి ఫ్లై ఓవర్లు ఆపాలని కేంద్రమంత్రి గడ్కరీకి లేఖ రాశారన్నారు. ఈ నెల 14న గడ్కరీని కలవాలని పురందేశ్వరి కేంద్రమంత్రిని కోరారని అన్నారు. గుడివాడ టీడీపీ నేతలు కూడా కుమ్మక్కయ్యారన్నారు. ఈ ఫ్లై ఓవర్లు పడితే ఎంపీకి, నాకు, వైసీపీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. గుడివాడలో రెండు ఫ్లై ఓవర్లు కడితే ఎంతోమందికి ఉపయోగం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా 10మంది కోసం ఇలా ఫ్లై ఓవర్లు ఆపాలని ప్రయత్నించడం దారుణం అన్నారు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించా కానీ ఫలితం లేదన్నారు. గుడివాడ ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఫ్లై ఓవర్లు ప్రారంభించేవరకూ టెంట్ వేసి ఆందోళన సాగిస్తామని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!