Kodali Nani: పురందేశ్వరి వాటిని అడ్డుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ మాటెత్తితే అంతెత్తున లేస్తారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని). చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీ నేతల్ని ఉతికి ఆరేస్తుంటారు. అలాంటిది ఈసారి నానిగారి టార్గెట్ మారింది. బీజేపీ నేతలపై ఆయనన విమర్శలు చేస్తున్నారు. గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందని, అయితే వాటిని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అడ్డుకుంటున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారని, అదే హోదాతో ఆమె గుడివాడకు మంజైరైన ఫ్లై ఓవర్లను అడ్డుకుంటున్నారని నాని ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఈ మేరకు సోమవారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించారు కొడాలి నాని. ఇప్పటికైనా గుడివాడ అభివృద్ది పనులను అడ్డుకునే ప్రయత్నాలను విరమించాలని ఆయన పురందేశ్వరికి సూచించారు. లేనిపక్షంలో పురందేశ్వరి తీవ్ర పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని నాని వార్నింగ్ ఇచ్చారు. గుడివాడ ప్రజానీకం రైల్వే గేట్ల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారని నాని చెప్పారు. ఎంపీ బాలశౌరి లోక్ సభలో ఫ్లై ఓవర్లు కట్టాలని కోరారన్నారు.
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
సీఎం జగన్ కూడా రెండు ఫ్లై ఓవర్లు శాంక్షన్ చేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారన్నారు. ఈ నెల 26న టెండర్లు ఓపెన్ చేయాల్సి వుందన్నారు. అయితే పురందేశ్వరి అక్కడ వున్న షాపులు, పెట్రోల్ బంకుల వారికి ఫ్లై ఓవర్లు ఆపాలని కేంద్రమంత్రి గడ్కరీకి లేఖ రాశారన్నారు. ఈ నెల 14న గడ్కరీని కలవాలని పురందేశ్వరి కేంద్రమంత్రిని కోరారని అన్నారు. గుడివాడ టీడీపీ నేతలు కూడా కుమ్మక్కయ్యారన్నారు. ఈ ఫ్లై ఓవర్లు పడితే ఎంపీకి, నాకు, వైసీపీకి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. గుడివాడలో రెండు ఫ్లై ఓవర్లు కడితే ఎంతోమందికి ఉపయోగం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా 10మంది కోసం ఇలా ఫ్లై ఓవర్లు ఆపాలని ప్రయత్నించడం దారుణం అన్నారు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించా కానీ ఫలితం లేదన్నారు. గుడివాడ ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఫ్లై ఓవర్లు ప్రారంభించేవరకూ టెంట్ వేసి ఆందోళన సాగిస్తామని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!