Kashibugga Stampade: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
- తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
- క్షతగాత్రులకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం. -మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashibugga Stampade: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, 94 ఏళ్ల వృద్ధుడు స్వంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. “ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు,” అని చెప్పారు.
Also Read
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది. భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తుంటారు. శనివారం భక్తుల రద్దీ పెరగడంతో మెట్లపై ఉన్న రెయిలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. రెయిలింగ్ పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతిచెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసకు చెందిన అమ్ములు ఉన్నారు. గాయపడినవారిని పలాస, టెక్కలి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా మాట్లాడుతూ, సాధారణంగా రోజుకు రెండు వేల మంది భక్తులు వస్తారని, కానీ శనివారం సుమారు 25 వేల మంది రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు.
“ఇంత మంది వస్తారని ముందుగానే తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాణ్ణి. దర్శనానికి వెళ్లే క్యూలైన్, తిరిగి వచ్చే మార్గం ఒకటే కావడం ప్రమాదానికి దారితీసింది,” అని ఆయన వివరించారు. అధికారులు కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసి ఉంటే ఈ దుర్ఘటన తప్పించుకునేదని తెలిపారు.
తాజావార్తలు
-
BVS Ravi: బాలయ్య ‘అన్స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
-
RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
-
Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
-
Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు
-
Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!