Kashibugga Stampade: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
- తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
- క్షతగాత్రులకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం. -మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashibugga Stampade: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, 94 ఏళ్ల వృద్ధుడు స్వంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. “ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు,” అని చెప్పారు.
Also Read
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది. భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తుంటారు. శనివారం భక్తుల రద్దీ పెరగడంతో మెట్లపై ఉన్న రెయిలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. రెయిలింగ్ పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతిచెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసకు చెందిన అమ్ములు ఉన్నారు. గాయపడినవారిని పలాస, టెక్కలి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా మాట్లాడుతూ, సాధారణంగా రోజుకు రెండు వేల మంది భక్తులు వస్తారని, కానీ శనివారం సుమారు 25 వేల మంది రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు.
“ఇంత మంది వస్తారని ముందుగానే తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాణ్ణి. దర్శనానికి వెళ్లే క్యూలైన్, తిరిగి వచ్చే మార్గం ఒకటే కావడం ప్రమాదానికి దారితీసింది,” అని ఆయన వివరించారు. అధికారులు కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసి ఉంటే ఈ దుర్ఘటన తప్పించుకునేదని తెలిపారు.
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!