Kashibugga Stampade: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
- తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
- క్షతగాత్రులకు రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం. -మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashibugga Stampade: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. భక్తుల రద్దీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, 94 ఏళ్ల వృద్ధుడు స్వంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. “ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు,” అని చెప్పారు.
Also Read
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది. భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తుంటారు. శనివారం భక్తుల రద్దీ పెరగడంతో మెట్లపై ఉన్న రెయిలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది. రెయిలింగ్ పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతిచెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మ, పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ, మందసకు చెందిన రాజేశ్వరి, బృందావతి, నందిగాం మండలానికి చెందిన యశోదమ్మ, సోంపేటకు చెందిన నిఖిల్, పలాసకు చెందిన అమ్ములు ఉన్నారు. గాయపడినవారిని పలాస, టెక్కలి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా మాట్లాడుతూ, సాధారణంగా రోజుకు రెండు వేల మంది భక్తులు వస్తారని, కానీ శనివారం సుమారు 25 వేల మంది రావడంతోనే తొక్కిసలాట జరిగిందన్నారు.
“ఇంత మంది వస్తారని ముందుగానే తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాణ్ణి. దర్శనానికి వెళ్లే క్యూలైన్, తిరిగి వచ్చే మార్గం ఒకటే కావడం ప్రమాదానికి దారితీసింది,” అని ఆయన వివరించారు. అధికారులు కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసి ఉంటే ఈ దుర్ఘటన తప్పించుకునేదని తెలిపారు.
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!