Karumuri Venkat Reddy: చంద్రబాబుపై కౌంటర్లు.. యువగళంపై సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Venkat Reddy Satires On Lokesh Yuvagalam And Chandrababu Naidu: ఏపీ రాజధాని వ్యవహారంపై చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల మీద, అలాగే లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కరుమూరి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో మూడు రాజధానుల అంశం లేదని, కాబట్టి ఆ చట్టం ప్రకారం రాజధానిని ఎన్నుకొనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు. మరి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయని.. ఆ లెక్క ప్రకారం ఏపీలో 26 జిల్లాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోకూడదని మీరు భావిస్తున్నారా? అంటూ కౌంటరిచ్చారు. ఈ జిల్లాల విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి, ఏదైనా పోరాటం చేయదలచుకున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన బీనామీలు కొన్న భూములకు రేట్లు రావాలన్న ఉద్దేశంతోనే.. అమరావతినే రాజధానిగా నిర్ణయించాలంటూ ఆయన పట్టుబడుతున్నారని ఆరోపించారు.
Kim Wife: కిమ్ మాత్రమే కాదు.. ఆయన భార్య ఏం చేసినా సంచలనమే
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయవాదం చాలా బలంగా ఉందని, దాని వల్లే మన రాష్ట్రం రెండుగా విడిపోయిందని వెంకట్రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అనేక కమిటీలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా.. మరో విభజన రాకూడదని, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారన్నారు. కానీ.. మూడేళ్లుగా దాన్ని అడ్డుకుంటూ కుట్రలు పన్నుతున్నారని, ఈ కుట్రలు ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చంద్రబాబు అంటున్నారని.. మరి ‘అమరావతి’ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు జనాలు రావడం లేదని, దాన్ని కవర్ చేసుకోవడం కోసమే చంద్రబాబు మీడియా ముందుకొచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రప్రభుత్వంపై, సీఎం జగన్పై అక్కసు వెళ్లగక్కేందుకే చంద్రబాబు మీడియా ముందు మాట్లాడారని విమర్శించారు.
Kethireddy Pedda Reddy: ఇసుక రీచ్ వద్ద జేసీ ఆందోళన.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్
అసలు యువగళం మీద విమర్శలు చేయాలనే ఆలోచన తమకు లేదని, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాట్లాడాల్సి వస్తోందని వెంకట్రెడ్డి అన్నారు. సాధారణంగా మనం న్యూస్ ఛానెల్స్ చూస్తుంటామని, అప్పుడు ఛానెల్స్ మారుస్తున్న క్రమంలో మధ్యలో కామెడీ ఛానెల్స్ కూడా వస్తాయని, యువగళం కూడా అలాంటి కామెడీ వ్యవహారమేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ యువగళంలో లోకేష్ మాట్లాడుతున్న మాటలు చాలా వింతగా, విచిత్రంగా ఉన్నాయని సెటైర్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఓ యువగళం ఉంది, దాని నిండా పప్పుంది, దాన్ని తిప్పేందుకు పప్పు గిత్తి ఉంది, ఆ పప్పుని ఉడకబెట్టడం కోసం కింద ఎల్లో మీడియా అనే పెద్ద నిప్పు ఉంది, 15 రోజుల నుంచి ఎంత ఉడకబెట్టాలని ట్రై చేసినా ఆ పప్పు ఉడకట్లేదని వెంకట్రెడ్డి కౌంటర్లు వేశారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!