Nadendla Manohar: పౌర సరఫరాల శాఖలో లోపాలు ఉన్నాయి.. సరిదిద్దుతాం..!
- కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో సివిల్ సప్లై శాఖపై మంత్రి నాదెండ్ల సమీక్ష..
- గత ఐదేళ్లలో ఎన్నిసార్లు తనిఖీ చేశారని ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్..
- ఒక్క రోజులో 7615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశాం: మంత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న క్షేత్ర స్థాయి పరిశీలనలో గోడౌన్ లలో ఉన్న రేషన్ బియ్యంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్ని తనిఖీలు చేశారని అధికారులను మంత్రి ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాఫియా, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న గోల్ మాల్ ఏంటని ఆరా తీశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్ గా రేషన్ బియ్యంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు.
Read Also:NEET Paper Leak : నీట్ వివాదం.. జార్ఖండ్లో జర్నలిస్టు అరెస్ట్.. గుజరాత్లోని ఏడు చోట్ల దాడులు
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సమగ్ర రిపోర్టు తయారు చేసుకుని రేషన్ బియ్యం దందా పై సిఐడి ను ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటాం.. కాకినాడ పోర్ట్ లో దందా జరుగుతుంది.. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు.. సొంత వ్యవస్థలు నడుపుతున్నారు అని మండిపడ్డారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటాము.. ఒక కుటుంబం కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు.. కాకినాడలో సామాన్యుడు పొట్ట కొట్టే వ్యవస్థీకృత మాఫియా ఉంది అని ఆయన ఆరోపించారు. 5 కోట్ల జనాభాలో నాలుగు కోట్ల 45 లక్షల మందికి ప్రభుత్వం రేషన్ ఇస్తుందన్నారు. పౌర సరఫరా శాఖలో లోపాలు ఉన్నాయి.. తొందరలోనే సరిదిద్దుతాం.. ఒక్క రోజులో 7, 615 మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!