Pawan Kalyan: పిఠాపురంలో పార్టీ ప్రక్షాళనపై పవన్ కల్యాణ్ ఫోకస్.. ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి తొలగింపు..
- పిఠాపురంలో పార్టీ ప్రక్షాళన పై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్..
- ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి తొలగింపు..
- 2 నెలల క్రితం ఇంఛార్జ్ స్థానంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఐదుగురితో కమిటీ..
- మర్రెడ్డిపై వస్తున్న ఫిర్యాదులతో ఫైవ్ మెన్ కమిటీ నుంచి కూడా తొలగింపు..
- మర్రెడ్డి స్థానంలో ఓదూరి కిషోర్ నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. మరో వైపు పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో బలోపేతం, శ్రమించిన వారికి గుర్తింపు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం పిఠాపురంలో పార్టీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే, గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్ను రెండు నెలల క్రితం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
Read Also: Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అయితే, గత కొంత కాలంగా మర్రెడ్డి పై పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ పనితీరుకు ఆటంకంగా మారిన అంశాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ మరో కీలక చర్య తీసుకున్నారు. దీంతో మర్రెడ్డిని ఫైవ్ మెన్ కమిటీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మర్రెడ్డి స్థానంలో పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న, చేబ్రోలు ప్రాంతంలో జనసేన పార్టీ సమావేశాలు, కార్యకర్తలకు నివాసం, వసతి వంటి సౌకర్యాలు అందించిన ఓదూరి కిషోర్ను కొత్త సభ్యుడిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పిఠాపురంలో పార్టీ ఆర్గనైజేషన్ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే ఎన్నికలకు ముందు జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు జనసేన నేతలు..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!