Vinayaka Chaturthi 2025: ఏపీలో వెరైటీ వినాయక విగ్రహాలు.. అదిరిపోయే లుక్లో దర్శనం
- ఏపీలో వెరైటీ రూపాల్లో వినాయక విగ్రహాలు..
- చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలతో గణనాథులు..
- పర్యావరణ పరిరక్షణ రూపాల్లో గణేష్ విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinayaka Chaturthi 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన, వివిధ రకాల పదార్థాలతో, వినూత్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలు వంటి వాటితో వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఇతర రూపాల్లో గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నారు.
చాక్లెట్ లతో వినాయకుడు..
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వినాయక చవితి సందర్భంగా విశేష ఆకర్షణగా నిలుస్తోంది వినాయక కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన వెరైటీ వినాయకుడు. 10 రూపాయల చాక్లెట్లు, 5స్టార్ చాక్లెట్లతో చేసిన ఈ గణనాథుడిని తయారు చేయడానికి సుమారు 5 వేల చాక్లెట్లు ఉపయోగించారు. వీటి అంచనా విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన ఈ చాక్లెట్ వినాయకుడిను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఉల్లిగడ్డలతో బొజ్జ గణపయ్య..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన వెరైటీ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 800 కిలోల ఉల్లిగడ్డలు, 100 కిలోల పాప్ కార్న్ ఉపయోగించి, దాదాపు 1. 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ బుజ్జి గణపయ్యను తయారు చేశారు. ఈ వినూత్నమైన వినాయకుడిని చూసేందుకు భక్తులు, స్థానికులు భారీగా తరలి వెళ్తున్నారు.
వేరుశెనగలతో గణనాథుడు..
వినాయక చవితి సందర్భంగా వేరు శెనగలతో తయారు చేసిన బొజ్జ గణపయ్య కాకినాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేల కిలోల వేరుశెనగలు ఉపయోగించి కళాత్మకంగా రూపొందించిన ఈ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ వేరుశెనగ వినాయకుడిని దర్శించి, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!