Vinayaka Chaturthi 2025: ఏపీలో వెరైటీ వినాయక విగ్రహాలు.. అదిరిపోయే లుక్లో దర్శనం
- ఏపీలో వెరైటీ రూపాల్లో వినాయక విగ్రహాలు..
- చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలతో గణనాథులు..
- పర్యావరణ పరిరక్షణ రూపాల్లో గణేష్ విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinayaka Chaturthi 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన, వివిధ రకాల పదార్థాలతో, వినూత్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలు వంటి వాటితో వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఇతర రూపాల్లో గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నారు.
చాక్లెట్ లతో వినాయకుడు..
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వినాయక చవితి సందర్భంగా విశేష ఆకర్షణగా నిలుస్తోంది వినాయక కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన వెరైటీ వినాయకుడు. 10 రూపాయల చాక్లెట్లు, 5స్టార్ చాక్లెట్లతో చేసిన ఈ గణనాథుడిని తయారు చేయడానికి సుమారు 5 వేల చాక్లెట్లు ఉపయోగించారు. వీటి అంచనా విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన ఈ చాక్లెట్ వినాయకుడిను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఉల్లిగడ్డలతో బొజ్జ గణపయ్య..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన వెరైటీ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 800 కిలోల ఉల్లిగడ్డలు, 100 కిలోల పాప్ కార్న్ ఉపయోగించి, దాదాపు 1. 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ బుజ్జి గణపయ్యను తయారు చేశారు. ఈ వినూత్నమైన వినాయకుడిని చూసేందుకు భక్తులు, స్థానికులు భారీగా తరలి వెళ్తున్నారు.
వేరుశెనగలతో గణనాథుడు..
వినాయక చవితి సందర్భంగా వేరు శెనగలతో తయారు చేసిన బొజ్జ గణపయ్య కాకినాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేల కిలోల వేరుశెనగలు ఉపయోగించి కళాత్మకంగా రూపొందించిన ఈ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ వేరుశెనగ వినాయకుడిని దర్శించి, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!