Vinayaka Chaturthi 2025: ఏపీలో వెరైటీ వినాయక విగ్రహాలు.. అదిరిపోయే లుక్లో దర్శనం
- ఏపీలో వెరైటీ రూపాల్లో వినాయక విగ్రహాలు..
- చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలతో గణనాథులు..
- పర్యావరణ పరిరక్షణ రూపాల్లో గణేష్ విగ్రహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinayaka Chaturthi 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన, వివిధ రకాల పదార్థాలతో, వినూత్న రూపాల్లో గణనాథుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల చాక్లెట్లు, ఉల్లిగడ్డలు, వేరుశెనక్కాయలు వంటి వాటితో వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఇతర రూపాల్లో గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నారు.
చాక్లెట్ లతో వినాయకుడు..
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వినాయక చవితి సందర్భంగా విశేష ఆకర్షణగా నిలుస్తోంది వినాయక కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన వెరైటీ వినాయకుడు. 10 రూపాయల చాక్లెట్లు, 5స్టార్ చాక్లెట్లతో చేసిన ఈ గణనాథుడిని తయారు చేయడానికి సుమారు 5 వేల చాక్లెట్లు ఉపయోగించారు. వీటి అంచనా విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన ఈ చాక్లెట్ వినాయకుడిను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Also Read
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ఉల్లిగడ్డలతో బొజ్జ గణపయ్య..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని విజయనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన వెరైటీ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 800 కిలోల ఉల్లిగడ్డలు, 100 కిలోల పాప్ కార్న్ ఉపయోగించి, దాదాపు 1. 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ బుజ్జి గణపయ్యను తయారు చేశారు. ఈ వినూత్నమైన వినాయకుడిని చూసేందుకు భక్తులు, స్థానికులు భారీగా తరలి వెళ్తున్నారు.
వేరుశెనగలతో గణనాథుడు..
వినాయక చవితి సందర్భంగా వేరు శెనగలతో తయారు చేసిన బొజ్జ గణపయ్య కాకినాడలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేల కిలోల వేరుశెనగలు ఉపయోగించి కళాత్మకంగా రూపొందించిన ఈ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ వేరుశెనగ వినాయకుడిని దర్శించి, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!