Kakarla Suresh: 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్, లక్ష రూపాయలు పెళ్ళికానుక, పది లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బీసీల కోసం ఏం చేశారు ఏం చేయబోతున్నామనేది.. తెలిపేందుకు ఏప్రిల్ 5 నుంచి గ్రామాలలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని ఆయన తెలిపారు.
Read Also: Gidugu Rudra Raju: విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
బీసీల కోసం పెళ్ళికానుక, చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, ప్రమాద బీమా అయితే ఐదు లక్షల రూపాయలు, చట్టబద్ధంగా కుల గణన, లక్షా 50 వేల కోట్ల తోటి సబ్ ప్లాన్, పెళ్ళికానుక, బీసీలకు కమ్యూనిటీ హాల్, కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని తెలుసుకొని బలహీన వర్గాల ప్రజలు మరల టీడీపీకి సపోర్ట్గా ఉండడం శుభపరిణామన్నారు. స్థానిక సంస్థల్లో 30% , నామినేట్ పదవుల్లో 50 శాతం బీసీలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత టీడీపీది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు. గంజాం రాఘవేంద్రరావు, చింత బోయిన బయన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.