Kakarla Suresh: కాకర్ల సురేష్కి అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలిగిరి పట్టణంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కలిగిరి ప్రధాన రహదారి వెంబడి ప్రచారం నిర్వహించారు. ప్రతి షాపు దగ్గరకు వెళ్లి తెలుగుదేశాన్ని ఆదరించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రచార రథం పై అభివాదం చేస్తూ ప్రధాన రహదారుల వెంబడి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. సాగునీరు లేక బంజర భూముల సైతం బీడు భూములుగా మారాయన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ , మరియు సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా నీటిని ఉదయగిరి ప్రాంతానికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
Read Also: Elon Musk PM Modi: ప్రధాని మోదీని కలవనున్న ఎలోన్ మస్క్.. దేశంలో పెట్టుబడుల విషయం పై చర్చ..!
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదన్నారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని కాకర్ల సురేష్ తెలిపారు. ఇసుక మైనింగ్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రశ్నిస్తే ఎంతటి వారినైనా హతం చేసే దానికి వైసీపీ నాయకులు బరితెగించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. బటన్ నొక్కుతున్నాను అని చెప్పి పది రూపాయలు ఇచ్చి ₹100 లాగుతున్నారు ఆయన ఆరోపించారు. వాలంటీర్లకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వస్తే గౌరవ వేతనం 10,000 రూపాయలను ఇస్తామని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారికి ఒక ఇల్లు అయినా కట్టించి ఇచ్చారన్నారు. కాంట్రాక్టర్లకు దోసి పెట్టేందుకే పేదలకు ఇళ్ల పేరట జగన్నాటకం ఆడుతున్నారన్నారు. పునాదిరాళ్లకే అవి పరిమితం అయ్యాయని కాకర్ల సురేష్ చెప్పుకొచ్చారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ అనే నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు.
తాజావార్తలు
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!