Juvvaladinne Boats Missing Mystery issue: ఆ బోట్లు ఎక్కడ..? ఎవరి పాత్ర ఏంటి..?
- జువ్వలదిన్నె హార్బర్ నుంచి నాలుగు బోట్లు మాయం
- మత్స్యకారుల పంచాయితీలో సంచలన ఆరోపణలు
- ఎంపీ పేరుతో బయటపడ్డ కీలక వివరాలు
- 5 కోట్ల జరిమానా.. ఒప్పందం కుదరక ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లు అదృశ్యమైన ఘటనపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు , తిరుపతి జిల్లాల నుంచి సుమారు 160 గ్రామాల మత్స్యకార పెద్దలు ప్రకాశం జిల్లా పాకాలలో భారీ పంచాయితీ నిర్వహించారు. ఈ బహిరంగ విచారణలో అధికార పార్టీ ఎంపీ ప్రమేయం ఉన్నట్లు వెల్లడవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
గత 20 ఏళ్లుగా తమిళనాడు మత్స్యకారులు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తమ జీవనోపాధిని కాపాడుకునే క్రమంలో, మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పుదుచ్చేరి కారైకాల్కు చెందిన నాలుగు బోట్లను పట్టుకున్నారు. వాటిని జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచి, వాటి రక్షణ బాధ్యతను ఇసుకపల్లె, కొత్త బంగారుపాలెం వంటి గ్రామాల పెద్దలకు అప్పగించారు. అయితే, గత నెలలో ఈ నాలుగు బోట్లు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి.
Also Read
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్కు కారణం అతడే!
మత్స్యకార కుల కట్టుబాటు ప్రకారం నిర్వహించిన విచారణలో ప్రధాన నిందితుడు తోటయ్య సంచలన విషయాన్ని బయటపెట్టాడు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ప్రోద్బలంతోనే ఆ బోట్లను విడిచిపెట్టినట్లు ఆయన బహిరంగంగా ఒప్పుకున్నాడు. హార్బర్లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా పోలీస్ అధికారుల సూచనలతోనే బోట్లను పక్కకు పెట్టామని మొదట బుకాయించినా, నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
బోట్ల మాయానికి కారణమైన మత్స్యకారులకు కుల పెద్దలు 5 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించారు. అయితే, ఇసుకపల్లిపాలెం మత్స్యకారులు దీనిని తిరస్కరిస్తూ, తాము కేవలం కోటిన్నర రూపాయలు లేదా రెండు బోట్లను మాత్రమే ఇస్తామని తెగేసి చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన అంగీకారం కుదరకపోవడంతో తెల్లవారుజామున 6 గంటల వరకు సాగిన ఈ మహాసభ అర్ధాంతరంగా ముగిసింది.
Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఇతర రాష్ట్రాల జాలర్లు ప్రవేశించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు తీర్మానించారు. తీరం వెంబడి నాలుగు బోట్లతో నిరంతర గస్తీ ఏర్పాటు చేయాలని, మత్స్యకార చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. జువ్వలదిన్నె ఘటనపై చట్టపరమైన విచారణ జరిపించాలని కోరుతూ, తదుపరి కార్యాచరణ కోసం మరోసారి సమావేశం కానున్నట్లు పెద్ద కాపులు ప్రకటించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..