JTC Venkateswara Rao: సంక్రాంతి వేళ చార్జీల మోత..! ప్రత్యేక నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JTC Venkateswara Rao: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్కు అసలైన పండుగ.. ప్రయాణికులను రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి.. అయితే, పండుగ సమయంలోనూ సాధారణ చార్జీలే వసూలు చేస్తోంది ఆర్టీసీ.. అదే సమయంలో.. ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్చేసుకునేవారికి రాయితీ కూడా కల్పిస్తోంది. అయితే, ఈ ఏడాది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను భారీ పెంచే అవకాశం ఉండడంతో.. అప్రమత్తం అయ్యారు రవాణాశాఖ అధికారులు.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన జేటీసీ వెంకటేశ్వరరావు.. సంక్రాంతికి ప్రతేడాది చేస్తున్న విధంగానే ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుందని.. దీనిపై రవాణ శాఖ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని తెలిపారు.. పండుగ దినాలను ఆసరా తీసుకుని ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుంది.. దీనికి చెక్ పెట్టేందుకు బార్డర్ చెక్ పోస్టుల్లో నిఘా పెడతామని వెల్లడించారు.
Read Also: Vidadala Rajini: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే.. పేర్లే వేర్వేరు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు చెక్ పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందిని పెడతామని తెలిపారు జేటీసీ వెంకటేశ్వరరావు. నిఘా బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. స్టాపేజ్ ఉన్న బస్సులను తిప్పుతారు.. ఫిట్నెస్ లేని బస్సులు.. టాక్స్లు కట్టని బస్సులు తిరిగే అవకాశం ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాసింజర్లకు ఇబ్బంది లేకుండా తనిఖీలు చేస్తాం.. సేఫ్టీ లేని బస్సుల్లో ప్రయాణం చేయవద్దని పాసింజర్లకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ నుంచే రవాణా శాఖ తనిఖీల డ్రైవ్ చేపట్టనున్నట్టు ప్రకటించారు జేటీసీ వెంకటేశ్వరరావు. కాగా, గతంలో.. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు.. చార్జీలను కూడా పెంచుతూ వెళ్లిన సందర్భాలున్నాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారి.. ప్రత్యేక బస్సులు నడుపుతూనే.. సాధారణ చార్జీలు వసూలు చేయడం.. ఇంకా రాయితీలు కూడా ప్రకటిస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!