జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి, పార్టీ శ్రేణుల దుస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. పార్టీలో కాకరేపారు.. కొందరని ఉద్దేశిస్తూ పరోక్షంగా జేసీ కామెంట్లు చేయడంతో ఆ నేతలను నొచ్చుకున్న పరిస్థితి.. ఈ నేపథ్యంలో పెద్దపప్పూరు మండలం జూటూరులోని తోటలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని కలిశారు శింగనమల తెలుగుదేశం పార్టీ నేతలు.. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలోనైనా విబేధాలు సహజం.. భిన్నాభిప్రాయాలు ఉంటాయన్న ఆయన.. పార్టీకి హాని కలిగే విబేధాలు ఉన్నాయని నేను అనుకోవడంలేదన్నారు. రెండేళ్లుగా సైలెంట్గా ఉన్నారు.. అన్ని గమనిస్తున్నాను.. టీడీపీ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.
పార్టీకి నష్టం కలిగించే స్థాయిలో టీడీపీలో విభేదాలు లేవన్నారు జేసీ దివాకర్రెడ్డి.. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో ఒక్క తాడిపత్రి మున్సిపాల్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తుచేసిన ఆయన.. అనంతపురం జిల్లాలో ఎక్కడా రెండు కౌన్సిలర్ స్థానాలు కూడా టీడీపీ గెలుచకపోవడం దురదృష్టకరం అన్నారు.. నా దగ్గరకు టీడీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారో తెలియదన్న ఆయన.. తన వద్దకు ఎవరు వచ్చినా బాగోగులు అడుగుతానే తప్ప రాజకీయాలపై చర్చించడం జరగలేదన్నారు.. అయితే, జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలని కామెంట్ చేశారు జేసీ దివాకర్రెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..