Jayaprada Meets Draupadi murmu: రాష్ట్రపతితో జయప్రద భేటీ.. అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అభినందించారు ఒకప్పటి సినీనటి, రాజకీయ నేత జయప్రద. మీ పదవీకాలం జయప్రదం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతిగా మన దేశపు అత్యున్నత పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్ లో ప్రథమ మహిళను కలిశారు జయప్రద… ఆమె పదవీకాలం జయప్రదం కావాలని ఆకాంక్షించారు.

Also Read
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన జయప్రద ఎన్టీఆర్ పిలుపుతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పక్షాన చేరి తెలుగు దేశము పార్టీ మహిళా విభాగమునకు అధ్యక్షురాలయ్యారు. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశము పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన టీడీపీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికయ్యారు.
2009లో తిరిగి ఎన్నికయ్యారు. ములాయం సింగ్పై తిరుగుబాటు చేసిన జయప్రద అమర్ సింగ్ పక్షాన నిలిచారు. 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించబడ్డారు జయప్రద.. అనంతరం అమర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్లో చేరారు. అయితే, ఉత్తరప్రదేశ్లో పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత 2014లో అమర్ సింగ్తో పాటు జయప్రద అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. జయప్రద ఆర్ ఎల్ డి అభ్యర్థిగా బిజ్నోర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి… నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2019 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె బీజేపీలో చేరారు. అయితే ఆమెకు ఎక్కడా టికెట్ లభించలేదు. ఇటీవల తన స్వస్థలం రాజమండ్రికి వచ్చిన జయప్రద రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆమె బీజేపీ తరఫున ఏపీలో లోక్ సభకు పోటీచేస్తారని భావిస్తున్నారు.
Iraq Protest: ఇరాక్ పార్లమెంట్లోకి దూసుకొచ్చి.. ప్రధాని అభ్యర్థిత్వంపై నిరసనకారుల ఆగ్రహం
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!