Loan Apps, Accidents Awarness: జంగారెడ్డిగూడెంలో లోన్ యాప్స్, ప్రమాదాలపై అవగాహన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. అమాయకులు లోన్ యాప్ ల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఏలూరు జిల్లా ఎస్.పి. రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా లో లోన్ యాప్ లు, ఆక్సిడెంట్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అందులో భాగంగా సచివాలయ మహిళా పోలీసులకు(GMSK) లకు అవగాహన కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డి.ఎస్.పి. కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి. సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో దిశ యాప్ మెగా డౌన్ లోడ్ కార్యక్రమం జరుగుతోందన్నారు.
దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడికి సమీపంలో వున్న పోలీసులు వారికి అందుబాటులోకి వస్తారన్నారు. మహిళలకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి సహకరిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ లు వాడడం వలన అనేక నకిలీ లోన్ యాప్ లు డౌన్ లోడ్ అయ్యి ప్రజలను అప్పుల పేరుతో ఉచ్చులోకి లాగుతున్నాయన్నారు. ప్రజలు లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని అవి తీర్చలేక ఆత్మ హత్యల వరకూ పరిస్థితి వెళ్తోందనన్నారు.
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
Read Also:
Ram Gopal Varma: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కంటే కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్
ఇలాంటి ఫేక్ లోన్ యాప్ ల నుండి అప్పులు తీసుకుని ముప్పు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే చిట్ ఫండ్ లలో డబ్బులు కట్టేటప్పుడు అనధికారిక చిట్ ఫండ్ లలో డబ్బులు పెట్టి వాటిని పోగొట్టుకుంటున్నారని కాబట్టి అనధికారిక చిట్ ఫండ్ లకు, కాల్ మనీ వ్యాపారులకు ప్రజలు దూరంగా వుండాలని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఇటీవల అనేక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లాలో ఆక్సిడెంట్ లు జరిగినప్పుడు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే వుంటున్నారన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వారు హెల్మెట్ ధరించక పోవడం వలన ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. ఇక నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అందుకు సచివాలయ మహిళా పోలీసులు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగం కావాలని అన్నారు. అలాగే సచివాలయ మహిళా పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామాలలో ఏచిన్న సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చి సహకరిస్తున్నారని డి.ఎస్.పి. సచివాలయ మహిళా పోలీసులను ఆభినందించారు.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!