Loan Apps, Accidents Awarness: జంగారెడ్డిగూడెంలో లోన్ యాప్స్, ప్రమాదాలపై అవగాహన
తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. అమాయకులు లోన్ యాప్ ల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఏలూరు జిల్లా ఎస్.పి. రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు జిల్లా లో లోన్ యాప్ లు, ఆక్సిడెంట్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అందులో భాగంగా సచివాలయ మహిళా పోలీసులకు(GMSK) లకు అవగాహన కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డి.ఎస్.పి. కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి. సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో దిశ యాప్ మెగా డౌన్ లోడ్ కార్యక్రమం జరుగుతోందన్నారు.
దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడికి సమీపంలో వున్న పోలీసులు వారికి అందుబాటులోకి వస్తారన్నారు. మహిళలకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి సహకరిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ లు వాడడం వలన అనేక నకిలీ లోన్ యాప్ లు డౌన్ లోడ్ అయ్యి ప్రజలను అప్పుల పేరుతో ఉచ్చులోకి లాగుతున్నాయన్నారు. ప్రజలు లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని అవి తీర్చలేక ఆత్మ హత్యల వరకూ పరిస్థితి వెళ్తోందనన్నారు.
Also Read
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
Read Also:
Ram Gopal Varma: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కంటే కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్
ఇలాంటి ఫేక్ లోన్ యాప్ ల నుండి అప్పులు తీసుకుని ముప్పు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే చిట్ ఫండ్ లలో డబ్బులు కట్టేటప్పుడు అనధికారిక చిట్ ఫండ్ లలో డబ్బులు పెట్టి వాటిని పోగొట్టుకుంటున్నారని కాబట్టి అనధికారిక చిట్ ఫండ్ లకు, కాల్ మనీ వ్యాపారులకు ప్రజలు దూరంగా వుండాలని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్ లో ఇటీవల అనేక రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లాలో ఆక్సిడెంట్ లు జరిగినప్పుడు చనిపోయిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే వుంటున్నారన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వారు హెల్మెట్ ధరించక పోవడం వలన ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని డి.ఎస్.పి. సత్యనారాయణ అన్నారు. ఇక నుండి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అందుకు సచివాలయ మహిళా పోలీసులు ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగం కావాలని అన్నారు. అలాగే సచివాలయ మహిళా పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామాలలో ఏచిన్న సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చి సహకరిస్తున్నారని డి.ఎస్.పి. సచివాలయ మహిళా పోలీసులను ఆభినందించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!