కీలక సమావేశాన్ని వాయిదా వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 9వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన కార్యనిర్వాహక సమావేశం జరగాల్సి ఉంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, ఇతర అంశాలతో పాటు వివిధ వర్గాలు ఎదుర్కొంటన్న సమస్యలపై చర్చించాలనుకున్నారు.
Read Also: జగ్గారెడ్డి దీక్ష రద్దు
మరోవైపు.. పార్టీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలని భావించారు జనసేన అధినేత పవన్.. అయితే, ఆ సమావేశాన్ని వాయిదా వేసినట్టు ఇవాళ ప్రకటించింది జనసేన పార్టీ.. కరోనా కేసులు పెరుగుతోన్న కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్టు జనసేన స్పష్టం చేసింది.