Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది… ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరగనున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది… ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది… ఆయా రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇతర సాంకేతిక సలహాదారులు కూడా పాల్గొనబోతున్నారు..
Read Also: Phd student: వైరల్గా మారిన పీహెచ్డీ విద్యార్థి చేసిన పని.. ఏం చేశాడంటే..?
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ సాగనుంది.. డ్యాం నిర్మాణం, ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.. అయితే, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రం సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.. దీంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ.. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి అధికారులతో పాటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎస్లు, ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు.. ఈ సమావేశంలో ఎలాంటి చర్చ సాగనుంది.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే, పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతో డిజైన్ చేసినా.. 58 లక్షల క్యూసెక్కుల వదర వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వాదనగా ఉండగా.. ఏపీ మాత్రం ఇది కొట్టిపారేస్తోంది.. గోదావరిలో వందేళ్లలో గరిష్టంగా వచ్చిన వదర 28.5 లక్షల క్యూసెక్కులు మాత్రమేననని.. ఆ మేరకు పోలవరం స్పిల్ వే నిర్మిస్తే సరిపోతుందంటున్నారు.. ఇక, తెలంగాణ వాదిస్తున్నట్లు పోలవరానికి 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశమే లేదంటోంది కేంద్ర జలశక్తి శాఖ.. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేసి ముంపు సమస్య రాదని.. వచ్చే అవకాశం కూడా లేదని సాంకేతికంగా వెల్లడించింది అంటున్నారు.. కానీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ మాత్రం కేంద్ర జలశక్తి ఇప్పటికే నిర్బంద్వంగా తిరస్కరించినా పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై ఉమ్మడి రీ సర్వే చేయాలని పట్టుబడుతున్నాయి.. దీంతో, ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!