Jawan Rajasekhar Last Rites: అమరజవాన్ రాజశేఖర్కు అంతిమ వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లాలో అమర జవాన్ రాజశేఖర్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనెల 16న జమ్ముకాశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలో అన్నమయ్య జిల్లాకు చెందిన తెలుగు జవాన్ మృతి చెందాడు. ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, దేవపట్లకు చెందిన దేవరింటి రాజశేఖర్ (34) అనే ఆర్మీ జవాన్ మృతి చెందిన విషయం తెలిసిందే… ఆర్మీ జవాన్ రాజశేఖర్ మృతదేహాన్ని ఐటిబిపి అధికారులు స్వగ్రామైన దేవపట్లకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, 53వ ఐటిబిపి బెటాలియన్ డిప్యూటీ కమాండెటర్ ఆయూస్ దీపక్ లు జవాన్ రాజశేఖర్ స్వగృహానికి చేరుకొని ఆర్మీ జవాన్ రాజశేఖర్ భౌతిక గాయాన్ని సందర్శించి పుష్ప గుచ్చాలు ఉంచి శ్రధ్దాంజలి ఘటించారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్మీ జవాన్ రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటుందని, రెండు రోజుల్లో పరిహారం చెక్కును అందజేస్తామని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ వెల్లడించారు. సంబేపల్లి మండల కేంద్రం నుండి దేవపట్ల వరకు అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర నిర్వహించారు.
Also Read
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
జవాన్ అంతిమ యాత్రలో సంబేపల్లె, దేవపట్ల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలుచుని అడుగడుగునా పూలు చల్లుతూ జై జవాన్, అమర్ రహే రాజశేఖర్ అంటూ సెల్యూట్ చేస్తూ నినాదాలు చేశారు. అంతిమ యాత్ర అనంతరం స్వగ్రామైన దేవపట్లలో ఆర్మీ జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు సైనిక్, ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జవాన్ పార్థివ దేహంపై ఆర్మీ అధికారులు ఉంచిన జాతీయ జెండాను జవాన్ రాజశేఖర్ భార్య ప్రమీలకు ఆర్మీ అధికారులు అందజేశారు. ఐటిబిపి, ఏపీ పోలీసులు ఆర్మీ జవాన్ రాజశేఖర్ పార్ధవదేహం వద్ద నిలబడి గౌరవవందనం చేసి గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. తుది వీడ్కోలు పలకడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంబేపల్లె తహశీల్దార్ దగ్గర ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. రాయచోటి రూరల్ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో సంబేపల్లె ఎస్ఐ మహమ్మద్ షరీఫ్, పోలీసు సిబ్బంది బందోబస్తును నిర్వహించారు.
Read Also: Vijayashanti: బీజేపీపై రివర్స్ ఎటాక్.. వాళ్లను పాతరేస్తే బెటర్
తాజావార్తలు
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!