హైదరాబాద్ నగర అభివృద్ధి, పర్యావరణ, సిటీ మేనేజ్మెంట్ అంశాల్లో కీలక పాత్ర పోషించే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీ మంగళగిరి కార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు కొనసాగింది.
Tirupati: విషాదం.. నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు..!
భేటీ కారణాలపై ప్రాథమికంగా అధికారిక ప్రకటనలు అందకపోవడంతో, ఈ సమావేశం గురించి రాజకీయ, సామాజిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. హైడ్రా హైదరాబాద్లో చేపడుతున్న సిటీ అభివృద్ధి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, భవన లే అవుట్ ప్రాజెక్టులు, వర్షకాల నిర్వహణ, పలు సమస్యలు వంటి అంశాలపై చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Gudivada Amarnath: జగన్ వాస్తవాలు చెప్తుంటే మంత్రులు తట్టుకోలేకపోతున్నారు..!