Guntur Husband Crime: భార్యాభర్తల మధ్య ‘ఆ’ చిచ్చు.. పార్లర్లోనే చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Koteswara Rao Killed His Wife Swathi: గుంటూరు జిల్లాలోని తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్యూటీ పార్లర్ నడుపుతున్న భార్యను భర్త కిరాతకంగా హతమార్చాడు. ‘స్థలం’ విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణం. స్థలం అమ్మాలని చాలారోజుల నుంచి భర్త కోరుతుండగా.. భార్య అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. పార్లర్లోనే భార్యని కత్తితో నరికి చంపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గాంధీ నగర్కు చెందిన కోటేశ్వరరావు(35)కి కొన్ని సంవత్సరాల క్రితం స్వాతి(31) అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. పెళ్లైన కొన్నాళ్ల వరకూ వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వారి సంసారం నడిచింది.
కానీ.. ఆ తర్వాత కోటేశ్వరరావు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రానురాను అతడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈమధ్య బాకీలు తారాస్థాయికి చేరుకోవడంతో.. భార్య పేరు మీదున్న స్థలాన్ని అమ్మేసి, ఆ అప్పులు తీర్చాలని అనుకున్నాడు. అయితే.. స్వాతి అందుకు ఒప్పుకోలేదు. ‘నీ బాకీలకు నా స్థలం ఎందుకు అమ్మాలి?’ అని ఎదురు తిరిగింది. కోటేశ్వరరావు ఎంత వేడుకున్నా.. స్వాతి స్థలం అమ్మేందుకు అస్సలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం (17-11-22) కూడా ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈసారి కూడా ససేమిరా అనేసిన స్వాతి, బ్యూటీ పార్లర్కి వెళ్లిపోయింది. దీంతో కోపాద్రిక్తుడైన కోటేశ్వరరావు.. నేరుగా బ్యూటీపార్లర్కు వెళ్లి, కత్తితో నరికి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహంపై దండలు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఈ కేసులో ఎలాగో తాను దొరికిపాతానుకున్నాడో ఏమో.. భార్యని చంపిన అనంతరం రూపర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కోటేశ్వరరావు లొంగిపోయాడు. తన భార్య స్థలం అమ్మేందుకు ఒప్పుకోకపోవడం వల్లే తాను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనని చెప్పాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!