Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News High School Students Letter To Highcourt Cj

High School Students Protest: మా హైస్కూల్ మాకే కావాలి.. సీజేకి విద్యార్ధుల లేఖాస్త్రాలు

Published Date :August 23, 2022 , 11:46 am
By NTV WebDesk
High School Students Protest: మా హైస్కూల్ మాకే కావాలి.. సీజేకి విద్యార్ధుల లేఖాస్త్రాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమ పాఠశాల అంటే వారికెంతో అభిమానం..తమకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలను వేరేచోటికి తరలించడాన్ని వారు నిరసించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి మాయదార్లపల్లి విద్యార్థులు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. మా పాఠశాల మాకే కావాలి.మాకు చదువును దూరం చెయ్యవద్దు అంటూ వేడుకున్నారు. గత 45 రోజులుగా పోరాటం చేస్తున్న విద్యార్థులు.. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి గ్రామం మారుమూల ప్రాంతం. ఎక్కడో విసిరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లో చిట్ట చివరి గ్రామాలైన ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామం మాయదార్లపల్లి గ్రామం. అలాంటి గ్రామంలో గత 45 రోజులుగా ఆ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేయటాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడి బయట ఉన్నాం అయినా కూడా మమ్ములను పట్టించుకున్న నాథుడు లేడని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

Read Also: God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్‌లు

చివరికి పెద్దల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ,ప్రధాన న్యాయస్థానం, నేలపాడు అమరావతి- పిన్ 522 237 అను అడ్రస్ కు పోస్ట్ కార్డు ద్వారా లేఖలు రాశారు..

గౌరవనీయులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా?

సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కాని మేము మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు అక్కడే నివసిస్తున్నారు. మేము అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము. మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేము మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.

అందుకనే మా ఇంట్లో ని పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపు చేయించి మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు మా పశువులను గొర్రెలను మేపడానికి మమ్ములను సిద్ధం చేస్తున్నారు. కావున దయగల మహాప్రభువులు మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం. లేదంటే మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకుంది. కావున తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా …మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము.

అంటూ పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు ఉత్తరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాసుకున్నారు. మరి ప్రధాన న్యాయమూర్తి ఈ చిన్నారుల విన్నపానికి ఎలా స్పందిస్తారో చూద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • andhrapradesh
  • Baswapur
  • distance
  • Goats

తాజావార్తలు

  • Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!

  • Tragedy: అంబులెన్స్ ను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ సహా పేషెంట్ మృతి

  • Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

  • NASA Artemis II: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions