Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News High School Students Letter To Highcourt Cj

High School Students Protest: మా హైస్కూల్ మాకే కావాలి.. సీజేకి విద్యార్ధుల లేఖాస్త్రాలు

Published Date :August 23, 2022 , 11:46 am
By NTV WebDesk
High School Students Protest: మా హైస్కూల్ మాకే కావాలి.. సీజేకి విద్యార్ధుల లేఖాస్త్రాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమ పాఠశాల అంటే వారికెంతో అభిమానం..తమకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలను వేరేచోటికి తరలించడాన్ని వారు నిరసించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి మాయదార్లపల్లి విద్యార్థులు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. మా పాఠశాల మాకే కావాలి.మాకు చదువును దూరం చెయ్యవద్దు అంటూ వేడుకున్నారు. గత 45 రోజులుగా పోరాటం చేస్తున్న విద్యార్థులు.. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి గ్రామం మారుమూల ప్రాంతం. ఎక్కడో విసిరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లో చిట్ట చివరి గ్రామాలైన ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని కనీసం మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామం మాయదార్లపల్లి గ్రామం. అలాంటి గ్రామంలో గత 45 రోజులుగా ఆ విద్యార్థులను బసాపురం స్కూల్ నందు విలీనం చేయటాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడి బయట ఉన్నాం అయినా కూడా మమ్ములను పట్టించుకున్న నాథుడు లేడని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

Read Also: God Father Teaser: కాపీ చేసి మళ్లీ దొరికిపోయిన తమన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్‌లు

చివరికి పెద్దల సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ,ప్రధాన న్యాయస్థానం, నేలపాడు అమరావతి- పిన్ 522 237 అను అడ్రస్ కు పోస్ట్ కార్డు ద్వారా లేఖలు రాశారు..

గౌరవనీయులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సన్నిధానానికి నమస్కరించి వ్రాయునది ఏమనగా?

సార్! నేను అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలోని 6,7,8, తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కాని మేము మా ఊరి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో కుంట అను ప్రాంతంలో మా పెద్దలు అక్కడే నివసిస్తున్నారు. మేము అక్కడి నుండి పాఠశాలకు చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్లు వంకలు వాగలు చెట్ల వెంబడి పుట్ల వెంబడి నడుచుకుంటూ మాయదార్లపల్లి పాఠశాలకు చేరుకుంటున్నాము. మా తరగతులను బసాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు విలీనం చేయడంతో మేము మరల మాయదార్లపల్లి గ్రామం నుండి మరో మూడు కిలోమీటర్లు నడిచి బసాపురం గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.

అందుకనే మా ఇంట్లో ని పెద్దలు మా చదువులు మధ్యలోని ఆపు చేయించి మమ్ములను మా తోటి విద్యార్థులను బడి మానివేయించి మా పొలాల్లోని పనులకు మా పశువులను గొర్రెలను మేపడానికి మమ్ములను సిద్ధం చేస్తున్నారు. కావున దయగల మహాప్రభువులు మా పాఠశాల తరగతులను మా ఊరిలోనే నిర్వహించే విధంగా చేస్తే బాగా చదువుకుంటాం. లేదంటే మా తల్లిదండ్రులు మమ్ములను ఎటు పనికి రాకుండా పశువుల కాపర్లుగా గొర్రెల కాపర్లుగా తదితర పనులకు పెట్టబోతున్నారు. అంతేకాకుండా మా పాఠశాల నాడు నేడు పనులన్నీ పూర్తి కాబడి సుందరంగా రూపురేఖలు తిద్దుకుంది. కావున తమరు పెద్ద మనసుతో మా పాఠశాల తరగతులను బసాపురం గ్రామంలో విలీనం చేయకుండా …మా చదువులు మధ్యలో ఆగిపోకుండా మమ్మల్ని ఎలాగైనా కాపాడాలని మిమ్ములను వేడుకుంటున్నాము.

అంటూ పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు ఉత్తరాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రాసుకున్నారు. మరి ప్రధాన న్యాయమూర్తి ఈ చిన్నారుల విన్నపానికి ఎలా స్పందిస్తారో చూద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • andhrapradesh
  • Baswapur
  • distance
  • Goats

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions