YS Jagan Visit Sahana Family: సహన కుటుంబానికి జగన్ పరామర్శ.. ప్రభుత్వంపై ఫైర్.. వైసీపీ నుంచి పరిహారం ప్రకటన..
- గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వైఎస్ జగన్..
- సహన కుటుంబ సభ్యులను పరామర్శ..
- ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ సీఎం..
- వైసీపీ తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Visit Sahana Family: గుంటూరు ప్రభుత్వ హాస్పటల్లో సహన కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, జగన్ చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో తోపులాట జరిగింది.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో నా దళిత చెల్లి మరణం చూస్తే అర్ధం అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేది.. ఫోన్ కదిపితే పోలీసులు రక్షణగా ఉండేవారు.. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది.. తప్పు చేసిన వాళ్లు.. వాళ్ల వాళ్లు అయితే చాలు ప్రభుత్వం నిందితులకు రక్షణగా ఉంటుందని దుయ్యబట్టారు.. నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వాడు… పని చేస్తున్న సహన ను కారు ఎక్కించుకుని వెళ్లి దారుణంగా హత్య చేశారు.. నవీన్ ఒక్కడే కాదు ఇంకొందరు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు.. సహనను శారీరకంగా, లైంగికగా వేధించారు.. తీవ్ర దాడి చేసి నిందితులు హాస్పిటల్లో వదిలేసి వెళ్లి పోయారు.. కానీ, తప్పు చేసిన వాళ్లను ప్రభుత్వం ఉపేక్షిస్తుందని మండిపడ్డారు..
Read Also: Ananya : క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన అనన్య నాగళ్ల
Also Read
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
ఒక మహిళను బ్రెయిన్ డెడ్ అయ్యేదాకా దాడి చేసినా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు ? అని నిలదీశారు వైఎస్ జగన్.. బాధితులకు అండగా ఎందుకు ఈ ప్రభుత్వం నిలబడలేదు..? అని ప్రశ్నించారు. అయితే, టీడీపీకి చెందిన వ్యక్తి కాబట్టే నిందితున్ని ప్రభుత్వం కాపాడుతుందన్న ఆయన.. నేను వస్తున్నాను అని తెలిశాక టీడీపీ నాయకులు వచ్చారు అని దుయ్యబట్టారు.. తెనాలి ఎమ్మెల్యే.. మంత్రిగా ఉన్నారు.. కనీసం స్పందించలేదన్న ఆయన.. నిస్సిగ్గుగా నిందితుడు ని కాపాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. బద్వేలులో కూడా ఇలాగే ఓ యువతిని అత్యాచారం చేసి తగల పెట్టేసారు.. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసారు.. ఆ దారుణం చేసింది కూడా టీడీపీ వాళ్లే అని ఆరోపించారు జగన్..
Read Also: Bigg Boss 8 Telugu: ఎంతపని చేస్తివి యష్మి.. వారి ప్రేమకు ఎండ్ కార్డు వేసావుగా
పిఠాపురంలో టీడీపీ నాయకుడు, టీడీపీ కార్పొరేటర్ భర్త.. పదహారేళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు.. అధికారం ఉందని ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జగన్.. ప్రభుత్వం ఈ తప్పులు ఒప్పుకోవాలి.. బాధితులకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.. డిప్యూటీ సీఎం సొంత నియోజకర్గంలో ఈ దారుణం జరిగితే.. పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు..? కనీసం బాధితులకు అండగా నిలబడలేరా..? హిందూపూర్ లో దసరా పండుగ రోజు అత్త కోడళ్లపై అత్యాచారం చేశారు.. ఎమ్మెల్యే బాలకృష్ణ బాధితులకు కనీసం అండగా నిలబడలేదు ని మండిపడ్డారు.. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. నాలుగు నెలల కాలం లో 77 మంది మహిళలపై అత్యాచారాలు, ఏడుగురు హత్యకు గురయ్యారు.. మీరు ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు..
Read Also: Yadadri Temple: భక్తులకు అలర్ట్.. యాదాద్రిలో ఇక నుంచి అలా చేయడం నిషేధం..
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది.. వైసీపీ పాలనలో దిశ అండగా ఉండేది అన్నారు జగన్.. ఆపదలో ఉంటే ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా ప్రభుత్వం ఉండేది… ముప్పై ఒక్క వేల మంది మహిళలను దిశ యాప్ ద్వారా కాపాడాం అన్నారు.. దిశా యాప్ ను, దిశా చట్టాన్ని టీడీపీ ఎందుకు పక్కన పెట్టింది..? అని నిలదీశారు.. ఇక, నారా లోకేష్, హోం మంత్రి అనిత కలసి దిశా చట్టాన్ని కాల్చేశారు… అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తల్లులకు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు.. పొడుపు సంఘాలకు డబ్బులు ఇవ్వడం లేదు.. అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు.. సీఎం చంద్రబాబు మహిళా లోకానికి క్షమాపన చెప్పాలి.. లేదంటే చరిత్ర హీనుడుగా మిగిలి పోతారని వ్యాఖ్యానించారు.. వైసీపీ తరఫున బాధితులకు పది లక్షల నష్ట పరిహారం ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!