Ambati Rambabu: అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా..?
- మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్..
- వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్నారు..
- దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించిన ఆయన.. దాంతో ఉదయం మాకు సంబంధం లేదని చెప్పి, మధ్యాహ్నానికి కార్పొరేటర్ల మెడలో కేంద్రమంత్రి పసుపు కండువాలు వేస్తున్నారని, ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు షాక్ .. మరోసారి 83వేలు దాటిన బంగారం..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
కాగా, గుంటూరు కార్పొరేషన్ రాజకీయాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. దిమాక్ ఉన్న వాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరు.. మేం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని పేర్కొన్నారు.. మైకు దొరికిందని మాట్లాడే అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు.. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేసిన అంబటి.. కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా ? అని సవాల చేశారు.. పొద్దున కొనడం లేదని చెప్పి , మధ్యాహ్నానికి వైసీపీ కార్పొరేటర్ల మెడలో టీడీపీ కండువాలు వేస్తున్నారు అని మండిపడ్డారు.. ఇదంతా మీ అభివృద్ధి చేసి వస్తున్నారా? ఈ పిట్టకథలు, పిల్ల కథలు వేరే వాళ్ళకి చెప్పుకోండి… గుంటూరు ప్రజలకు కాదు అన్నారు.. వైసీపీ నాయకులకు దిమాక్ ఉందో లేదో త్వరలో చూపిస్తాం.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ గెలవలేదు అని ఛాలెంజ్ చేశారు.. వైసీపీ గెలిపించిన మేయర్ ను గద్దించటం టీడీపీ నాయకుల వల్ల కాదు.. వాళ్లు ఏదో చేస్తాఉంటే మేం చూస్తా ఉంటామా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!