Ambati Rambabu: అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా..?
- మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్..
- వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్నారు..
- దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించిన ఆయన.. దాంతో ఉదయం మాకు సంబంధం లేదని చెప్పి, మధ్యాహ్నానికి కార్పొరేటర్ల మెడలో కేంద్రమంత్రి పసుపు కండువాలు వేస్తున్నారని, ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు షాక్ .. మరోసారి 83వేలు దాటిన బంగారం..
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
కాగా, గుంటూరు కార్పొరేషన్ రాజకీయాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. దిమాక్ ఉన్న వాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరు.. మేం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని పేర్కొన్నారు.. మైకు దొరికిందని మాట్లాడే అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు.. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేసిన అంబటి.. కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా ? అని సవాల చేశారు.. పొద్దున కొనడం లేదని చెప్పి , మధ్యాహ్నానికి వైసీపీ కార్పొరేటర్ల మెడలో టీడీపీ కండువాలు వేస్తున్నారు అని మండిపడ్డారు.. ఇదంతా మీ అభివృద్ధి చేసి వస్తున్నారా? ఈ పిట్టకథలు, పిల్ల కథలు వేరే వాళ్ళకి చెప్పుకోండి… గుంటూరు ప్రజలకు కాదు అన్నారు.. వైసీపీ నాయకులకు దిమాక్ ఉందో లేదో త్వరలో చూపిస్తాం.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ గెలవలేదు అని ఛాలెంజ్ చేశారు.. వైసీపీ గెలిపించిన మేయర్ ను గద్దించటం టీడీపీ నాయకుల వల్ల కాదు.. వాళ్లు ఏదో చేస్తాఉంటే మేం చూస్తా ఉంటామా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!