Ambati Rambabu: అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా..?
- మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్..
- వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్నారు..
- దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించిన ఆయన.. దాంతో ఉదయం మాకు సంబంధం లేదని చెప్పి, మధ్యాహ్నానికి కార్పొరేటర్ల మెడలో కేంద్రమంత్రి పసుపు కండువాలు వేస్తున్నారని, ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు షాక్ .. మరోసారి 83వేలు దాటిన బంగారం..
Also Read
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
కాగా, గుంటూరు కార్పొరేషన్ రాజకీయాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. దిమాక్ ఉన్న వాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరు.. మేం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని పేర్కొన్నారు.. మైకు దొరికిందని మాట్లాడే అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు.. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేసిన అంబటి.. కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా ? అని సవాల చేశారు.. పొద్దున కొనడం లేదని చెప్పి , మధ్యాహ్నానికి వైసీపీ కార్పొరేటర్ల మెడలో టీడీపీ కండువాలు వేస్తున్నారు అని మండిపడ్డారు.. ఇదంతా మీ అభివృద్ధి చేసి వస్తున్నారా? ఈ పిట్టకథలు, పిల్ల కథలు వేరే వాళ్ళకి చెప్పుకోండి… గుంటూరు ప్రజలకు కాదు అన్నారు.. వైసీపీ నాయకులకు దిమాక్ ఉందో లేదో త్వరలో చూపిస్తాం.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ గెలవలేదు అని ఛాలెంజ్ చేశారు.. వైసీపీ గెలిపించిన మేయర్ ను గద్దించటం టీడీపీ నాయకుల వల్ల కాదు.. వాళ్లు ఏదో చేస్తాఉంటే మేం చూస్తా ఉంటామా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!