Guntur Gold Scams: గోల్డ్ స్కాంలతో బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. నిన్న రాజుపాలెం మండలం నేడు తెనాలి జీడీసీసీ బ్యాంక్ లలో వరుస గోల్డ్ స్కాం లు బ్యాంక్ ల లో సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. పల్నాడు ప్రాంతం రాజుపాలెంలో సెంట్రల్ బ్యాంక్ లో గిల్ట్ బంగారం వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే తెనాలిలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ లో భారీ అవకతవకలు జరిగాయి. నకిలీ బంగారం తాకట్టు పెట్టు కొని దొంగ రుణాలు మంజూరు చేశారు బ్యాంక్ ఉద్యోగులు… చెంచుపేట జీడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఐదుగురు ఖాతాదారుల సాయంతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. సాధారణ తనికీల్లో భాగంగా బ్యాంక్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి మొత్తం 29 అకౌంట్లలో 42లక్షల రూపాయలు లోన్ తీసుకున్న ట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
వీరంతా గత మార్చి చివరి నుండి విడతలవారీగా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టారని ఈ కుంభకోణంలో రుణం తీసుకున్న ఐదుగురు ఖాతాదారుల వివరాలు గుర్తించామని మరింత లోతుగా ఆడిట్ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. బ్రాంచ్ మేనేజర్,తో పాటు బంగారం తనకా పెట్టుకునే అధికారి(అప్లైజర్) కుమ్మక్కయి రుణాలు మంజూరు చేసినట్టు విచారణలో తేలింది. మరికొన్ని అకౌంట్లలో తక్కువ నాణ్యత కలిగిన బంగారం పెట్టి ఎక్కువ డబ్బు రుణాలుగా పొందటం కొన్ని కేసుల్లో బంగారం విలువ కంటే ఎక్కువ డబ్బు రుణం పొందినట్లు గమనించారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగనున్నాయనీ ఈ వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించి నగదును రికవరీ చేస్తామనీ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
కాగా గుంటూరు జిల్లాలో బ్యాంక్ లలో ఈ తరహా మోసాలు ఖాతా దారులను ఆందోళనలో ముంచుతున్నాయి. అవసరం కోసం భద్రత కోసం బ్యాంక్ లో బంగారం పెడుతుంటే బ్యాంక్ సిబ్బంది ఇలా మోసాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతా దారులు.రాబోయే రోజుల్లో ఇంకెన్ని బ్యాంక్ ల లో ఈ తరహా మోసాలు జరుగుతాయో, ఎన్ని బంగారు నగలు మాయమవుతాయి చూడాలని అంటున్నారు.
వాస్తవానికి ఒక ఖాతాదారునికి లోన్ ఇవ్వాలంటే సవాలక్ష షూరిటీ లు శత కోటి నిబంధనలు పెట్టీ బ్యాంక్ ల చుట్టూ తిప్పడం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం బ్యాంకు సిబ్బంది చేసే పని. కానీ ఇలా అడ్డదారిలో రుణాలు మంజూరు చేసే విషయంలో మాత్రం కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారని, నిజంగా ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, అగ్రికల్చరల్ లోన్ ,గోల్డ్ లోన్ కావాలని వచ్చేవారికి సంతకాలు , అడ్వకేట్ లీగల్ ఒపీనియన్, తో పాటు నోటికి వచ్చిన నిబంధనలు చెప్పడం బ్యాంక్ సిబ్బందికి వెన్న తో పెట్టిన విద్య.
ఖాళీ ఇళ్ల స్థలాలు పెట్టుకొని లోన్ లు ఇవ్వలేమని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు అనుకున్నా అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన కొద్దిమంది సిబ్బంది అండ ఉంటే మాత్రం బ్యాంకు లోన్ తీసుకోవడం తీసుకున్న సొమ్ము లోన్ లు కట్టకుండా ఎగ్గొట్టడం కొంతమందికి మహా సరదాగా ఉంటుంది. బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి లక్షల సొమ్ము కాజేయాలన్న ఎంత ధైర్యం ఉండాలి అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో వినపడుతున్నాయి. కాకి బంగారంతో లక్షలు లోన్లు తీసుకున్నవారిని కఠినంగా శిక్షించాలని జనం కోరుతున్నారు.
Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోనసీమ జిల్లా పేరు మార్పు
తాజావార్తలు
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!