Gudivada Amarnath: రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు..
- ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు
- లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారు
- రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు- గుడివాడ అమర్నాథ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.. టీడీపీ మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంటామని ప్రకటించాలని అన్నారు.
Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?
Also Read
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి, తిరుమల పవిత్ర మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో ఎక్సయిజ్ షాపులు కేటాయింపు చూస్తే అర్ధం అవుతుందని విమర్శించారు. ఒక్క తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులు ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయ్యింది.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యోగుల బదిలీలపై ఉన్న ఫోకస్ పేదవాడి కష్టాల మీద లేదని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో హామీలు అమలులో ప్రభుత్వం వైఫల్యం అయినందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. లడ్డుపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రే దానిని నిరూపించేందుకు చొరవ తీసుకోవాలని తెలిపారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం
రాష్ట్రంలో సినిమా పోలీసింగ్ నడుస్తోంది.. ప్రభుత్వం చెప్పిన మాట తప్ప లా & ఆర్డర్ వైఫల్యం జరిగిందని చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సిట్ చీఫ్, ఆయన ఆధీనంలో జరిగే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పల్నాడులో లా& ఆర్దర్ మెయింటేన్ చేయడంలో ఐజీగా ఏ విధంగా సిట్ చీఫ్ వ్యవహరించారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రభుత్వాలు వేసిన సిట్లు ఎలా పనిచేస్తాయో తమకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేకనే సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కల్తీ నెయ్యి వాడారు కానీ.. ఎక్కడో తెలియదని సీఎం చెప్పడంలో అంతర్యం దాగి ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
తాజావార్తలు
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!