Guntur Cheating: గుంటూరులో గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా మోసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే మాల్ ఇప్పిస్తామన్నారు. కొన్ని వస్తువులు అయితే మార్కెట్ రేటు కంటే నలభైశాతం తక్కువకే ఇస్తామని మాయమాటలు చెప్పారు. అందరినీ నమ్మించేందుకు రెండు మూడు నెలలు చెప్పినట్లే చేసి తర్వాత కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వమంటే అడ్డం తిరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన పడుచూరి రమ్య, దిలీప్ లు గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో మోసాలకు తెరతీశారు. తెలిసిన వారితో పెట్టుబడురు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. ఏ వస్తువైనా మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు వస్తుందని నమ్మించారు. నిత్యావసర వస్తువులు మార్కెట్ రేటు కంటే పది శాతం తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పారు. బైకులు, హోం నీడ్స్ అయితే మరింత తక్కువ ధరకు వస్తాయని చెప్పారు. తెలిసినవాళ్లు కావడంతో ఇద్దరి మాటలు నమ్మారు. మొదట రెండు, మూడు సార్లు చెప్పినట్లే తక్కువ ధరకు వస్తువులు అందించారు. దీంతో వారిపై అందరికీ నమ్మకం కుదిరింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే మరింత లాభం వస్తుందని నమ్మించారు.
Also Read
లాభంతో పనిలేదనుకుంటే పదిరూపాయల వడ్డీ ఇస్తామని చెప్పారు. లాభాలు భారీగా వస్తాయని అందరూ ఆశపడ్డారు. ఇలా దాదాపు 50మంది రెండున్నర కోట్లు చెల్లించారు. తర్వాత సరుకు డెలివరీ చెయ్యకపోవడమే కాకుండా డబ్బులు అడిగితే మొహం చాటేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో దిలీప్ తండ్రి తాను పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పాడని బాధితులు చెబుతున్నారు. పదిహేను రోజులు గడిచిన తర్వాత డబ్బులు ఇచ్చేది లేదని, మీకు చైతనైది చేసుకోండంటూ బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. తాను నాలుగు లక్షలు ఇచ్చానని, తిరిగి డబ్బులు అడుగుతుంటే పట్టించుకోవడం లేదంటున్నాడు.
కిరణా వ్యాపారి అనిల్ కుమార్ అయితే 27లక్షలు కట్టి మోసపోయాడు. నిత్యావసర సరుకులు మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇస్తానంటే తాను నమ్మానని చెబుతున్నాడు. మొదట్లో తక్కువ ధరకే సరుకులు ఇవ్వడంతో తాను అప్పులు తీసుకొచ్చి 27లక్షలు చెల్లించానని చెబుతున్నాడు. ఇప్పుడు సరుకులు ఇవ్వలేదని, డబ్బులు అడిగితే పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. భారీగా ఆదాయం వస్తుందని బంగారం తాకట్టుపెట్టి పదిన్నర లక్షలు ఇస్తే తనను మోసం చేశారని మరో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిన్నప్పటినుంచి తెలిసినవారు కావడంతో నమ్మి డబ్బులు ఇచ్చామని, ఇలా మోసం చేస్తారని అనుకోలేదంటున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకే వస్తువులు, సరుకులు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sai Pallavi: ఐటెం సాంగ్స్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
- Tags
- ap
- bike
- chating case
- glaze india
- Guntur
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!