Flood Loss Estimations: భారీగా పంట నష్టం.. అంచనాల్లో అధికారగణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నడూ లేనివిధంగా తుపానుతో వచ్చే వర్షాల కంటే ఈసారి వానలు కుమ్మేశాయి. గోదావరి ఉగ్ర రూపానికి ఊళ్ళు ఏరులైపోయాయి. భారీ ఎత్తున వరద పోటెత్తడంతో ఏపీలో మొత్తంగా ఆరు జిల్లాలు అతలాకుతలంగా మారాయి. భారీ ఎత్తున పంట, ఆస్తి నష్టం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నష్టం అంచనా అనేది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా.. ప్రాథమిక స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించారు. ఎల్లుండి నుంచి పంట నష్టం అంచనా పనులను అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టనుంది.
గోదావరి మహోగ్ర రూపం చూపిస్తోంది. గత 36 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా వరద సంభవించింది. ఏపీలో మొత్తంగా ఐదు జిల్లాల్లో వరద ముంచెత్తింది. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఎంత మేర పంట నష్టం సంభవించిందనే దానిపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అటు ఊళ్లన్నీ ఇంకా ముంపులోనే ఉండడంతో పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయడం సాధ్యం కాదను. ఈ క్రమంలో ప్రాథమికంగా నష్టం ఎంత జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
వరదల వ్యవసాయ పంటలకు సుమారు 7842 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అలాగే హర్టికల్చర్కు సంబంధించి 14650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. ఇదే సందర్భంలో 1100 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. అయితే ఇదంతా ప్రాథమికంగా వేసిన అంచనా మాత్రమే. ఇవే కాకుండా.. ఇంకొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలు ఒరిగిపోవడం.. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినడం వంటివి కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ తొలి నాళ్లల్లోనే ఉండడంతో వ్యవసాయ పంటలకు నష్టం కొంత మేరకే ఉండొచ్చని.. కానీ హర్టికల్చర్కు మాత్రం భారీగానే నష్టం జరిగే సూచనలు కన్పిస్తోంది.
Farmers Hopes: వర్షాలతో ఏరువాకకు అన్నదాతలు సిద్ధం
గత రెండు మూడేళ్ల నుంచి వరదలు ఏపీని ఏదోక చోట ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నష్టం కూడా భారీగానే సంభవిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వరదలు భారీగా వచ్చిన సందర్భంలో నష్టం కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న సర్కార్.. ఆ మేరకు నివేదికలను సిద్దం చేసి కేంద్రానికి సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. సోమవారం నాటికల్ల వరద తీవ్రత చాలా వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్న అధికారులు.. సోమవారం నుంచి నష్టం అంచనా పనులను మరింత ముమ్మరంగా చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!