Chittoor Fire Accident: ఘోర ప్రమాదం.. ఆ నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి జరిగిన ప్రమాదం కంటే.. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాలు ప్రాణాలు పోయేందుకు కారణం అవుతాయి. చిత్తూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతికి అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం కారణంగా చెబుతున్నారు స్థానికులు… మంటలు ఎగసి పడుతుంటే అగ్నిమాపక శాఖ ఆలస్యంగా రావడం ఒక కారణం కాగా, తెచ్చిన సగం నీళ్ళు అయిపోయాయి. దీంతో నీటిని పట్టుకుని వస్తామని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్దానికులు… వారి నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటున్నారు.
స్థానికులైన తాము కిటికీలు పగులగొట్టి ప్రయత్నం చేశామే గాని వారు మాత్రం రాలేదంటున్నారు. అసలు చిత్తూరు అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతికి కారణం ఎవరు? చిత్తూరు నగరంలోని రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్లు తయారీ భవనంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంట్లలో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతుల్లో తండ్రి ,కొడుకుతో పాటు స్నేహితుడున్నాడు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందంటున్నారు.
Also Read
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
Read Also: AP Assembly Last Day: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అక్కడే వున్న స్థానికులు ప్రమాదం గురించి తెలుసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన భవనం గోడలు పగులగొట్టి స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చనిపోయారని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని భాస్కర్ (65), ఢిల్లీ బాబు (35) బాలాజీ (25)గా గుర్తించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కావడంతో విషాదం నెలకొంది.
Read Also: Gujarat: 15 ఏళ్ల బాలుడిని చంపేసిన సింహాలు..
తాజావార్తలు
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
-
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!