Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న బిల్లులపై ఆర్థిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పెండింగ్ బిల్లులపై వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. అయితే, పెండింగ్ బిల్లులపై అరకొరగా సమాచారాన్ని కొన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఇస్తున్నారు. మొత్తంగా 10 వేల కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ బిల్లులు ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
Read Also: Kejriwal: సీబీఐ అరెస్ట్పై కేజ్రీవాల్ పిటిషన్.. దర్యాప్తు సంస్థ వివరణ కోరిన హైకోర్టు
అయితే, శ్వేత పత్రం కోసం చేస్తున్న కసరత్తులో పెండింగ్ బిల్లుల అరకొర సమాచారంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం కోరుతూ మరోసారి అన్ని శాఖలకు లేఖలు రాయాలని ఆర్థిక మంత్రి వెల్లడించారు. పెండింగులో సమాచారం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని లేఖలో పేర్కొనాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారు.