Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో వైసీపీ బలహీన పడిందని చెప్పడానికి ఇవాళ జరిగిన సభ నిదర్శనం అన్నారు. రాయలసీమ గర్జన సభ జరిగిన తీరు వైసీపీ క్షీణ దశను తెలియజేస్తోంది. రాయలసీమకు నిధులు, నీళ్ళు, నియామకాలు కావాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారు. ఇక్కడ న్యాయ రాజధాని పెట్టడానికి మూడున్నరేళ్లుగా మీకున్న ఇబ్బంది ఏంటి? అధికారంలో ఉండి పని చేయాల్సిన వారు పోరాడతామని అనడం ఏంటి? అన్నారాయన.
Read Also: Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ఈ సభకు సామాన్య జనం ఎవరు వెళ్లలేదు.. వెళ్లిన విద్యార్థులు కూడా మధ్యలోనే వచ్చేసారు. ఇది సీమ గర్జన కాదు… వైసీపీ గ్రామ సింహాల గర్జన. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు. రాయలసీమకు తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం.ఎస్కేయులో 60 ఏళ్ల కిందట ఏర్పాటైన లా విభాగాన్ని ఎత్తేశారు. న్యాయ విద్యను బోధించే అధ్యాపకులు లేరు అని ఈ విద్యా సంవత్సరంలో లా ప్రవేశాలు రద్దు చేశారు. న్యాయ విద్యను లేకుండా చేసి అనంతకు, సీమకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు. ఇది పాలకుల అసమర్థత కాదా..! అని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. మూడు రాజధానులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో నేడు రాయలసీమ సభ గర్జన సభ నిర్వహించారు. మేధావులు, న్యాయవాదులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సభలో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాయలసీమ నేతలు మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని వైసీపీ నేతలు పునరరుద్ఘాటిస్తున్నారు.
Read Also: CPI Narayana: ఇదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఉండేవారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!