Kalva Srinivasulu:రాయలసీమకు తీరని అన్యాయం చేసింది జగనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో వైసీపీ బలహీన పడిందని చెప్పడానికి ఇవాళ జరిగిన సభ నిదర్శనం అన్నారు. రాయలసీమ గర్జన సభ జరిగిన తీరు వైసీపీ క్షీణ దశను తెలియజేస్తోంది. రాయలసీమకు నిధులు, నీళ్ళు, నియామకాలు కావాలని ఇక్కడి వారు కోరుకుంటున్నారు. ఇక్కడ న్యాయ రాజధాని పెట్టడానికి మూడున్నరేళ్లుగా మీకున్న ఇబ్బంది ఏంటి? అధికారంలో ఉండి పని చేయాల్సిన వారు పోరాడతామని అనడం ఏంటి? అన్నారాయన.
Read Also: Tortoise 190th Birthday: ఘనంగా తాబేలు 190వ బర్త్ డే
Also Read
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ఈ సభకు సామాన్య జనం ఎవరు వెళ్లలేదు.. వెళ్లిన విద్యార్థులు కూడా మధ్యలోనే వచ్చేసారు. ఇది సీమ గర్జన కాదు… వైసీపీ గ్రామ సింహాల గర్జన. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు. రాయలసీమకు తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం.ఎస్కేయులో 60 ఏళ్ల కిందట ఏర్పాటైన లా విభాగాన్ని ఎత్తేశారు. న్యాయ విద్యను బోధించే అధ్యాపకులు లేరు అని ఈ విద్యా సంవత్సరంలో లా ప్రవేశాలు రద్దు చేశారు. న్యాయ విద్యను లేకుండా చేసి అనంతకు, సీమకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు. ఇది పాలకుల అసమర్థత కాదా..! అని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఇదిలా ఉంటే.. మూడు రాజధానులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో నేడు రాయలసీమ సభ గర్జన సభ నిర్వహించారు. మేధావులు, న్యాయవాదులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సభలో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాయలసీమ నేతలు మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని వైసీపీ నేతలు పునరరుద్ఘాటిస్తున్నారు.
Read Also: CPI Narayana: ఇదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఉండేవారు.
తాజావార్తలు
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!